Home » Manipur
మణిపూర్ ఆవేదనను పట్టించుకుంటున్నామా? మునుపటి ‘పళని పలుకు’ పుటలు తిప్పుతూ నన్ను నేనే నిందించుకున్నాను. ఎందుకు? సంక్షుభిత మణిపూర్ గురించి తరచు రాయనందుకు.
మణిపూర్(Manipur)లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న నిరసనల మధ్య రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. దీంతోపాటు సెప్టెంబర్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ను నిషేధించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 11, 12న పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మణిపూర్కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అదనంగా 2 వేల సీఆర్పీఎఫ్ బలగాలను తరలించింది. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్లో ఉన్న 58వ బెటాలియన్, ఝార్ఖండ్లోని 112 బెటాలియన్ నుంచి వీరిని తరలిస్తున్నట్లు సీఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు.
మణిపూర్లో ద్రోణులు, మిసైల్ దాడుల నేపథ్యంలో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అయిదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ-మైతేయి వర్గాల మధ్య ఘర్షణలతో గతేడాది అట్టుడికిన ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అగ్గి రాజుకుంది. రాకెట్, డ్రోన్ బాంబు దాడులతో ఈసారి మరింత హైటెన్షన్ నెలకొంది.
జాతుల ఘర్షణల్లో కొంతకాలంగా మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఇటీవల తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరోసారి హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో శనివారం ఉదయం చెలరేగిన హింసాకాండలో ఆరుగురు మృతి చెందారు.
రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం దేవుళ్లమో కాదో ప్రజలే నిర్ణయిస్తారని అభిప్రాయ పడ్డారు. ఆ విషయాన్ని తాము ఏ రోజు చెప్పకోబోమని స్పష్టం చేశారు.
మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో రైఫిళ్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సెక్మై లీకింతబీలోని బీజేపీ ఎమ్మెల్యే జాయ్ కిషన్ సింగ్ ఫామ్హౌస్లోని మూడు రైఫిళ్లను దుండగులు దొంగిలించారు.
అల్లర్లతో అతలాకుతలమవుతున్న మణిపూర్ను సందర్శించాలని ప్రధాని మోదీకి విపక్షనేత రాహుల్ గాంధీ మరోమారు విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా శాంతియుత ప
ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు జరుపుకుంటున్న వేళ.. గురువారం ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మణిపూర్ ప్రజలకు సంబంధించిన ఫోటోను ఆయన షేర్ చేశారు. జాతుల మధ్య వైషమ్యాల కారణంగా మణిపూర్ ప్రజలకు ఓదార్పు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఆయన సూచించారు.