Share News

YUVAGALAM: యువగళానికి జనసైనికుల అపూర్వ స్వాగతం

ABN , First Publish Date - 2023-11-27T23:15:55+05:30 IST

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళానికి జనసైనికులు అపూర్వస్వాగతం పలికారు. బోడసకుర్రు బ్రిడ్జిపై యువనేత నారా లోకేష్‌కు ఎదురేగి జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

YUVAGALAM: యువగళానికి జనసైనికుల అపూర్వ స్వాగతం

రాజోల్: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళానికి జనసైనికులు అపూర్వస్వాగతం పలికారు. బోడసకుర్రు బ్రిడ్జిపై యువనేత నారా లోకేష్‌కు ఎదురేగి జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. యువగళానికి సంఘీభావంగా జనసేన, యువగళం జెండాలతో లోకేష్‌కి జనసైనికులు స్వాగతించారు. బ్రిడ్జి పొడవునా యువనేతను స్వాగతిస్తూ భారీ ఫ్లెక్సీలు జనసేన, టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. నినాదాలు చేస్తూ యువగళంతో కలిపి అభిమానులు, కార్యకర్తలు అడుగులు వేశారు .

Updated Date - 2023-11-27T23:16:05+05:30 IST