Share News

Btech Ravi: కడపను కరువు మండలాలుగా ప్రకటించాలి

ABN , First Publish Date - 2023-11-03T19:11:56+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) వెంటనే పులివెందుల నియోజకవర్గంలో ఉన్న మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ( Btech Ravi ) అన్నారు.

Btech Ravi: కడపను కరువు మండలాలుగా ప్రకటించాలి

కడప: వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) వెంటనే పులివెందుల నియోజకవర్గంలో ఉన్న మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ( Btech Ravi ) అన్నారు. శుక్రవారం నాడు పులివెందులలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...పులివెందుల నియోజకవర్గంలో సరైన వర్షపాతం నమోదు కాలేదు. వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల పట్ల వైసీపీ నాయకులకు అధికారులకు చిత్తశుద్ధి లేదు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే స్థానిక ఎంపీ అవినాష్‌రెడ్డి ఏం చేస్తున్నారు. పక్క జిల్లాలో కరువు మండలాలుగా ప్రకటించారు. కరువు మండలాలుగా ప్రకటిస్తే రైతులకు కొంతైనా న్యాయం జరుగుతుంది. ఉపాధి హామీ పథకంలో పని దినాలు పెరిగే అవకాశం ఉంటుంది. పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలను రౌడీషీటర్ల మాదిరిగా వేధిస్తున్నారు. యాంటి సోషల్ ఎలిమెంట్స్ పేరుతో టీడీపీ కార్యకర్తలను మాత్రమే వేధిస్తున్నారు. పోలీసుల తీరు సరైంది కాదు’’ అని బీటెక్ రవి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-03T19:11:57+05:30 IST