Thulasi Reddy: ఏపీని జగన్రెడ్డి సర్వనాశనం చేశాడు
ABN , First Publish Date - 2023-11-03T19:08:03+05:30 IST
మోదీ ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ( Thulasi Reddy) అన్నారు.
ప్రకాశం: మోదీ ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ( Thulasi Reddy ) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించారు.ఆంధ్రప్రదేశ్ని సీఎం జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. 1956 నుంచి 2014 వరకు 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో ఆంధ్రప్రదేశ్ అప్పు లక్ష కోట్లు ఉంది. జగన్ నాలుగేళ్లలో ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు పాలనకు మించినట్లుగా జగన్ పాలన ఉంది.
జగన్ పాలనలో రాష్ట్రం రౌడీ రాజ్యం అయ్యింది. ఎర్రచందనం, ఇసుక, మద్యం, ల్యాండ్ మాఫియాగా రాష్ట్రం తయారైంది. నవరత్నాలు నకిలీ రత్నాలుగా మారాయి. మాట తప్పడం మడమ తిప్పడం జగన్ దినచర్యగా మారింది’’ అని తులసిరెడ్డి ఎద్దేవ చేశారు.