Share News

AP NEWS: ఆంధ్రజ్యోతి విలేకరిపై మంత్రి జయరాం అనుచరుల దాడి

ABN , Publish Date - Dec 21 , 2023 | 08:40 PM

ఆంధ్రజ్యోతి విలేకరి శివపై మంత్రి జయరాం అనుచరులు దాడి చేశారు. విలేకరిపై విచక్షణ రహితంగా మానవత్వం లేకుండా దాడి చేశారు. ఈఘటనలో విలేకరికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. జిల్లాలోని కలెక్టరేట్ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు.

AP NEWS: ఆంధ్రజ్యోతి విలేకరిపై మంత్రి జయరాం అనుచరుల దాడి

కర్నూలు: ఆంధ్రజ్యోతి విలేకరి శివపై మంత్రి జయరాం అనుచరులు దాడి చేశారు. విలేకరిపై విచక్షణ రహితంగా మానవత్వం లేకుండా దాడి చేశారు. ఈఘటనలో విలేకరికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. జిల్లాలోని కలెక్టరేట్ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సర్కార్‌కు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా నాయకులు వినతి పత్రం సమర్పించారు. మంత్రి జయరాం అనుచరులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర , జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఏపీలో మీడియా ప్రతినిధులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Updated Date - Dec 21 , 2023 | 08:40 PM