Love story: రియల్ ‘‘మల్లీశ్వరి’’.. ప్రియుడి కోసం ఏకంగా వేల కోట్ల ఆస్తిని వదిలేసి.. చివరికి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..

ABN , First Publish Date - 2023-08-12T20:12:19+05:30 IST

చాలా మందికి మల్లీశ్వరి సినిమా గుర్తుండే ఉంటుంది. కోట్ల ఆస్తికి వారసురాలైన హీరోయిన్.. పేదవాడైన హీరోను ప్రేమించి, చివరకు ఆస్తినంతా వదులుకుని ప్రియుడితో వెళ్లిపోతుంది. ఇలాంటివి కేవలం సినిమాల్లోనే జరుగుతాయి.. నిజ జీవితంలో, అందులోనూ ప్రస్తుత స్వార్థ ప్రపంచంలో అసాధ్యమని అంతా అనుకుంటారు. కానీ..

Love story: రియల్ ‘‘మల్లీశ్వరి’’.. ప్రియుడి కోసం ఏకంగా వేల కోట్ల ఆస్తిని వదిలేసి.. చివరికి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..

చాలా మందికి మల్లీశ్వరి సినిమా గుర్తుండే ఉంటుంది. కోట్ల ఆస్తికి వారసురాలైన హీరోయిన్.. పేదవాడైన హీరోను ప్రేమించి, చివరకు ఆస్తినంతా వదులుకుని ప్రియుడితో వెళ్లిపోతుంది. ఇలాంటివి కేవలం సినిమాల్లోనే జరుగుతాయి.. నిజ జీవితంలో, అందులోనూ ప్రస్తుత స్వార్థ ప్రపంచంలో అసాధ్యమని అంతా అనుకుంటారు. కానీ ఈ సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోని విధంగా నిజ జీవితంలోనూ జరిగింది. ఇక్కడ కూడా ఓ యువతి తాను ప్రేమించిన ప్రియుడి కోసం వేల కోట్ల ఆస్తిని వదిలేసుకుంది. చివరకు ఏం జరిగిందంటే..

మలేషియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఖుకే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ ఛాయా దంపతులకు ఏంజెలిన్ అనే కుమార్తె ఉంది. ఏంజెలిన్ ఆక్స్‌ఫర్డ్ యేూనివర్సిటీలో చదువున్న సమయంలో జెడిడియా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం చివరకు ప్రేమగా రూపాంతరం చెందింది. అనతంరం ఇద్దరూ పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఏంజెలిన్ తన తల్లిదండ్రులకు తెలియజేసింది. అయితే వారు మాత్రం కూతురి ప్రేమను అంగీకరించలేదు. అయినా ఏంజెలిన్ మాత్రం తన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో చివరకు తల్లిదండ్రులు ఆమెకు ఓ కండీషన్ పెట్టారు. ప్రేమ వివాహం చేసుకుంటే ఆస్తి వదులుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినా ఏంజెలిన్ ఏమాత్రం లెక్కచేయకుండా సుమారు రూ.2,484 కోట్ల ఆస్తిని వదులుకుని ప్రియుడి వద్దకు వెళ్లింది.

Most Expensive Teapot: ఎంత బాగుందో.. కొనేద్దాం.. అని కలలో కూడా ఊహించకండి.. ఈ టీ పాట్ ధర ఎంతో తెలిస్తే..!

ఏంజెలిన్ 2008లో ప్రియుడిని పెళ్లి చేసుకుని, తల్లిదండ్రులకు దూరంగా వెళ్లిపోయింది. ఇదిలావుండగా, ఇటీవల ఏంజెలిన్ తల్లిదండ్రులు విడాకులు తీసుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కారు. ఈ విషయం తెలుసుకున్న ఏంజెలిన్.. తన తల్లికి మద్దతుగా నిలిచింది. కోర్టుకు వెళ్లి తన తల్లి గొప్పతనం గురించి అందరి ముందూ తెలియజేసింది. తన తండ్రి డబ్బు సంపాదనలో పడి బిజీ బిజీగా ఉన్న సమయంలో తన తల్లి కుటుంబాన్ని చూసుకుందని తెలిపింది. తనకు ఏ కష్టం రాకుండా ఎంతో ప్రేమతో చూసుకుందని చెప్పింది. తన తల్లిదండ్రులు మళ్లీ కలుసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఏంజెలిన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Metro Train: మెట్రో రైల్లో సరదాగా మాట్లాడుకుంటున్న ఫ్రెండ్స్.. సడన్‌గా వాళ్ల వద్దకు వచ్చిందో మహిళ.. ఆమె చెప్పింది విని..!

Updated Date - 2023-08-12T20:12:19+05:30 IST