Virtual Lover: నలుగురు పిల్లలతో పాటు తల్లి దారుణ హత్య.. భర్తపై డౌట్ వచ్చింది కానీ.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-09-02T18:12:30+05:30 IST

ముగ్గురు పిల్లలతో సంతోషంగా సాగుతున్న ఆ దంపతుల జీవితంలోకి మరో మహిళ రూపంలో సమస్య వచ్చి పడింది. భర్తపై కన్నేసిన ఆమె భార్యను చంపేందుకు పక్కా స్కెచ్‌తో ఇంట్లోకి చొరబడింది. భార్యను మాత్రమే చంపానుకున్నా చివరకు దారుణం జరిగింది. ఉదయం చూసేసరికి ఆ ఇంట్లో...

Virtual Lover: నలుగురు పిల్లలతో పాటు తల్లి దారుణ హత్య.. భర్తపై డౌట్ వచ్చింది కానీ.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!
ప్రతీకాత్మక చిత్రం

ముగ్గురు పిల్లలతో సంతోషంగా సాగుతున్న ఆ దంపతుల జీవితంలోకి మరో మహిళ రూపంలో సమస్య వచ్చి పడింది. భర్తపై కన్నేసిన ఆమె భార్యను చంపేందుకు పక్కా స్కెచ్‌తో ఇంట్లోకి చొరబడింది. భార్యను మాత్రమే చంపానుకున్నా చివరకు దారుణం జరిగింది. ఉదయం చూసేసరికి ఆ ఇంట్లో ఐదుగురు దారుణ హత్యకు గురవడం సంచలనం సృష్టించింది. అందరికీ భర్తపై అనుమానం వచ్చింది. చివరకు పోలీసుల విచారణలో అసలు ఏం తెలిసిందంటే..

కర్ణాటక (Karnataka) మాండ్యా జిల్లాలోని కేఆర్ సాగర్ అనే పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గంగారం అనే వ్యక్తి.. భార్య (30), కోమల(8), రాజ్ (10), కునాల్ (5) అనే ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. గంగారం పూలు, దస్తులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఎలాంటి గొడవలూ లేకుండా ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్న ఈ కుటుంబంలో మహిళ రూపంలో ఊహించని సమస్య వచ్చిపడింది. గంగారానికి దూరపు బంధువైన మైసూర్‌లో ఉంటున్న లక్ష్మి అనే మహిళ (woman) కన్ను ఇతడిపై పడింది. ఎలాగైనా గంగారంను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా ఆలోచించింది. చివరకు తాను ఎవరనే విషయం చెప్పకుండా రోజూ ఫోన్లలో మాట్లాడుతూ ఉండేది. ఇలా ఏడాది పాటు అతడితో ఫోన్ సంభాషణ చేసింది.

Viral Video: రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న ఈ మహిళ.. సడన్ గా వైరల్ అవడం వెనుక..!

police.jpg

గంగారానికి బాగా దగ్గరైన తర్వాత ఇటీవల ఓ రోజు ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా’’.. అని అడిగింది. ఇందుకు గంగారం అంగీకరించలేదు. ‘‘నాకు నా భార్య, పిల్లలే ముఖ్యం’’.. అని చెప్పడంతో లక్ష్మి షాక్ అయింది. అయినా ఎలాగైనా గంగారంను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో చివరకు దారుణ కుట్రకు (conspiracy) ప్లాన్ చేసింది. భార్యను చంపేస్తే గంగారం తన సొంతమవుతాడనే ఉద్దేశంతో పక్కా పథకం రచించింది. ఫిబ్రవరి 5న మైసూర్‍‪‌లో ఓ కత్తి కొనుక్కుని, ద్విచక్రవాహనంపై కేఆర్ సాగర్‌కు వచ్చింది. గంగారామ్ పని మీద బయటికి వెళ్లడం చూసి రాత్రి వేళ ఇంట్లోకి చొరబడింది. ముందుగా గంగారం భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపింది. ఆ శబ్ధానికి గంగారం పిల్లలు నిద్ర లేచారు. దీంతో విషయం బయట తెలుస్తుందనే ఉద్దేశంతో చివరకు వారిని కూడా చంపేసింది.

Viral: ప్రియుడు వంట చేస్తోంటే.. సాయంగా వెళ్లడమే ఆ ప్రేయసి పొరపాటయింది.. దాన్ని వాసన చూడటంతో..!

గంగారం ముగ్గురు పిల్లలతో పాటూ వారి బంధువు పిల్లాడిని కూడా చంపేసింది. తర్వాత తన మీద అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లో నగలు, నగదు దోచుకుని పరారైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఐదు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మొదట దోపిడీ కేసుగా నమోదు చేసుకున్నా.. చివరకు ఇటీవల అనుమానం వచ్చి గంగారం కాల్ డిటైల్స్‪‌ని పరిశీలించారు. ఇలా నిందితురాలు లక్ష్మి నంబర్ తీసుకుని, దాని ఆధారంగా మైసూర్‌లో ఉన్న నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. తన కామవాంఛ కోసం అమాయకులైన ఐదుగురి ప్రాణాలను తీసుకున్న లక్ష్మిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..

Updated Date - 2023-09-02T18:12:30+05:30 IST