Ponnala Lakshmaiya: ప్రజల ప్రాణాలతో కేసీఆర్ చెలగాటం

ABN , First Publish Date - 2023-07-31T23:47:46+05:30 IST

తెలంగాణ(Telangana)లో తీవ్రమైన వరదలు, భారీ వర్షాలు వచ్చి ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగితే ముఖ్యమంత్రి స్థాయిలో బయటకు వచ్చి కేసీఆర్(KCR) ఎందుకు మాట్లాడ్డం లేదు? అని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiya) అన్నారు.

Ponnala Lakshmaiya: ప్రజల ప్రాణాలతో కేసీఆర్ చెలగాటం

హైదరాబాద్(Hyderabad): తెలంగాణ(Telangana)లో తీవ్రమైన వరదలు, భారీ వర్షాలు వచ్చి ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగితే ముఖ్యమంత్రి స్థాయిలో బయటకు వచ్చి కేసీఆర్(KCR) ఎందుకు మాట్లాడ్డం లేదు? అని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiya) అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఎందుకు ప్రజలకు భరోసా ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు.భారీ వర్షాల(Heavy Rains)తో తెలంగాణ అంత అతలాకుతలం అయితే మెట్రో రైల్(Metro Rail) విస్తరణ గురించి మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. ప్రజల ప్రాణాలకు విలువ లేదా? ప్రజల ప్రాణాలతో సీఎం కేసీఆర్(CM KCR) చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.ఇది ఎన్నికల కేబినెట్(Election Cabinet) నిర్ణయం లాగా ఉందని చెప్పారు. వ్యవసాయ నష్టాలకు, ప్రాణ నష్టాలకు ఎలాంటి పరిహారాలు ప్రకటించలేదని పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-01T00:27:39+05:30 IST