Share News

Bapatla: బరితెగించిన ప్రేమోన్మాది.. యువతిని..

ABN , Publish Date - Oct 07 , 2024 | 03:47 PM

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కనగాలలో యువతి కుటుంబంపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగపడ్డాడు. గ్రామానికి చెందిన యువతిని రాజోలుకు చెందిన భార్గవ్ రెడ్డి అనే యువకుడు కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

Bapatla: బరితెగించిన ప్రేమోన్మాది.. యువతిని..

బాపట్ల: దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యాచారాలతో దుండగులు రెచ్చిపోతున్నారు. ఓ వైపు కామాంధులు లైంగిక దాడులకు తెగబడుతుంటే.. మరోవైపు ప్రేమ పేరుతో వేధింపులు పెరిగిపోతున్నాయి. మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోతోంది. దోషులపై చట్టాలను ఎంత పటిష్టంగా అమలు చేస్తున్నా ఉన్మాదుల్లో మాత్రం భయం కలగడం లేదు. నిత్యం ఆడవారిపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూనే ఉన్నారు.


తాజాగా అలాంటి ఘటనే ఒకటి బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో యువతి కుటుంబంపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగపడ్డాడు. గ్రామానికి చెందిన యువతిని రాజోలుకు చెందిన భార్గవ్ రెడ్డి అనే యువకుడు కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. యువతి ఎన్నిసార్లు తిరస్కరించినప్పటికీ అతను వెంటపడడం మానలేదు. అయితే ఇటీవల మరోసారి ఆమె ఎదుట ప్రేమ ప్రస్తావన తెచ్చి పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో యువతి తాను ప్రేమించనని, పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. ఆమెపై కోసం పెంచుకున్న భార్గవ్ రెడ్డి తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని నిశ్చయించుకున్నాడు.


ఇవాళ(సోమవారం) తెల్లవారు జామున యువతి ఇంటికి నిందితుడు భార్గవ్ రెడ్డి వచ్చాడు. అందరూ నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు ఒక్కసారిగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. యువతి తల్లిదండ్రులు లేచి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారిపైనా కత్తితో విరుచుకుపడ్డాడు. అందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వారంతా కేకలు పెట్టడంతో చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు బయటకు వచ్చాడు. ఇది గమనించిన భార్గవ్ రెడ్డి ఇంట్లో నుంచి పరారయ్యాడు. అనంతరం స్థానికుంతా బాధిత కుటుంబాన్ని రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


మరోవైపు విజయవాడలో ఓ కామాంధుడు 13ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి స్థానికంగా ఉంటున్న ఓ బాలికపై కన్నేశాడు. చిన్నారి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లైంగిక దాడికి యత్నించాడు. మద్యం పూటుగా తాగి బాలికపై అఘాయిత్యానికి ఒడికట్టాడు. అయితే చిన్నారి కేకలు విన్న స్థానికులు కామాంధుడిని పట్టుకున్నారు. అనంతరం దసరా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Duvvada Srinivas: ప్రియురాలితో కలిసి తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్..

AP Police: దుర్గమ్మ చెంత విధులకు వచ్చిన పోలీసులు.. ఎంతటి ఘనకార్యం చేశారంటే

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 07 , 2024 | 03:49 PM