Share News

Gidugu Rudraraju: వైఎస్ మరణంపై సీఎం జగన్ ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరలేదు

ABN , Publish Date - Jan 11 , 2024 | 06:02 PM

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ( YSR ) మృతిపై సీఎం జగన్ ( CM JAGAN ) చట్టసభల్లో ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ప్రశ్నించారు. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ మరణంపై వైసీపీ నేతలు చేసిన అర్థరహిత ఆరోపణలు సరికాదని అన్నారు.

Gidugu Rudraraju: వైఎస్ మరణంపై సీఎం జగన్ ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరలేదు

ప్రకాశం: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ( YSR ) మృతిపై సీఎం జగన్ ( CM JAGAN ) చట్టసభల్లో ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ప్రశ్నించారు. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ మరణంపై వైసీపీ నేతలు చేసిన అర్థరహిత ఆరోపణలు సరికాదన్నారు. వైఎస్ మరణంపై తమకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. జగన్ ఇప్పటి వరకు బీజేపీకి మద్దతుగా ఉండి కూడా సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరలేదని నిలదీశారు. వైఎస్ వివేకా మరణంపై కూడా ముఖ్యమంత్రిగా ఉండి జగన్ ఆ కేసును ఏం చేశారని నిలదీశారు. నిజమైన వైఎస్ వారసులుగా ఆయన మరణంపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. వైఎస్ మరణంపై మొదట రిలయన్స్‌ని అనుమానించి ముఖేష్ అంబానీ చెప్పిన వ్యక్తిని రాజ్యసభ సభ్యుడిగా జగన్ చేశాడని మండిపడ్డారు. జగన్ మానసిక స్థితి చూసిన తర్వాత తమకు అనుమానాలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరూ సంతృప్తిగా లేరని అన్నారు. త్వరలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న నేతలు తిరిగి హస్తం గుటికి చేరే అవకాశం ఉందని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాష్ట్రానికి కచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తారని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 06:03 PM