Share News

Anitha: వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం

ABN , Publish Date - Jul 18 , 2024 | 05:04 PM

సైకో జగన్ పాలనలో శాంతిభద్రతలను.. ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసునని హోంమంత్రి వంగలపూడి అనిత ( Home Minister Vangalapudi Anitha) అన్నారు. కొన్ని అరాచక శక్తులు తమ ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

 Anitha: వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
Home Minister Vangalapudi Anitha

అమరావతి: సైకో జగన్ పాలనలో శాంతిభద్రతలను.. ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసునని హోంమంత్రి వంగలపూడి అనిత (
Home Minister Vangalapudi Anitha)
అన్నారు. కొన్ని అరాచక శక్తులు తమ ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు.. అదుపులో ఉంటాయని ప్రజలకు తెలుసునని అన్నారు.

గత ఐదేళ్లలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. గత ఐదేళ్లుగా చంద్రబాబు, పవన్ వంటి నేతలకే ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. ప్రజలు ఇచ్చిన మద్దతును ఓర్చుకోలేక పోతున్నారని ధ్వజమెత్తారు.


ALSO Read: Nara Lokesh: జగన్ వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ కౌంటర్..

రెండు పార్టీల వ్యక్తులకు అప్పీల్ చేస్తున్నా అనవసరంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని అన్నారు. చట్టం ఎవరికైనా ఒక్కటే టీడీపీ, వైసీపీ నేతలు గుర్తించాలని అన్నారు.. పార్టీల కార్యకర్తలు సంయమనం పాటించాలని చెప్పారు. జగన్ రాష్ట్రపతికి, హోంమంత్రికి రాసే లేఖలో తన బాబాయ్ హత్య కేసు, డాక్టర్ సుధాకర్ హత్యలను ప్రస్తావించాలని అన్నారు. డ్రైవర్ సుబ్రమణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన కేసు సహా వివిధ ఘటనలను కూడా ప్రస్తావించాలని చెప్పారు.


ALSO Read: AP News: అడ్డొచ్చిన పోలీసులను ప్రేమోన్మాది ఏం చేశాడంటే?

వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని విమర్శించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోందని అన్నారు. దేనికైనా సమయం వస్తుందని అన్నింటిపైన చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చంద్రబాబు సీఎం అయ్యారంటేనే.. శాంతిభద్రతలు అదుపులో ఉన్నట్లు అని చెప్పారు. గతంలో దిశా యాప్‌ను మగవాళ్లతోనూ డౌన్‌లోడ్‌ చేయించారని గుర్తుచేశారు. అత్యాచార ఘటనల నియంత్రణకు పోలీసు, విద్యాశాఖలతో స్పెషల్ డ్రైవ్ చేపడతామని అన్నారు. గతంలో నేరస్తుడు దొరికినప్పుడు వేలిముద్రలు తీసుకుని అతను ఎన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నారో ఆరా తీసేవారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

MP Kesineni: నందిగామను ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దుదాం

Telangana చిక్కుల్లో మరో ఐఏఎస్ అధికారి ఫ్రపుల్ దేశాయ్..!

Mahasena Rajesh: ఆ సినిమాలో పశుపతిలా... సమాధి నుంచి వైసీపీ ఫేక్ ప్రచారాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 18 , 2024 | 05:08 PM