Share News

Kollu Ravindra: ఆ ఇద్దరిని పేర్నినాని దాచాడు... మంత్రి కొల్లు సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 06 , 2024 | 12:12 PM

Andhrapradesh: మాజీ మంత్రి కొడాలినాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను మాజీ మంత్రి పేర్నినాని దాచాడంటూ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శవం లెగిస్తే తప్ప జగన్ ఏపీకి రావాట్లేదంటూ కొల్లు ఫైర్ అయ్యారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే... జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే .. గద్దలా వాలటానికి జగన్ వస్తున్నారని విమర్శలు గుప్పించారు.

Kollu Ravindra: ఆ ఇద్దరిని పేర్నినాని దాచాడు... మంత్రి కొల్లు సంచలన వ్యాఖ్యలు
Minister Kollu Ravindra

అమరావతి, ఆగస్టు 6: మాజీ మంత్రి కొడాలినాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను మాజీ మంత్రి పేర్నినాని దాచాడంటూ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) సంచలన వ్యాఖ్యలు చేశారు. శవం లెగిస్తే తప్ప జగన్ ఏపీకి రావాట్లేదంటూ కొల్లు ఫైర్ అయ్యారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే... జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే .. గద్దలా వాలటానికి జగన్ (Former CM YS Jagan) వస్తున్నారని విమర్శలు గుప్పించారు.

Chinta Mohan: సుప్రీంకోర్టు తీర్పును తప్పు పట్టిన చింతా మోహన్


పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యురిటీ, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలంటూ సెటైర్ విసిరారు. రాబందులా ఐదేళ్ళు రాష్ట్రాన్ని పీక్కు తిన్న జగన్ అండ్ కో చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతోందన్నారు. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారన్నారు. పాపాలు చేసి పారిపోయిన వైసీపీ నేతలు ఎక్కడ దాక్కున్నా వెతుకొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం.


ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వంశీ, కొడాలినాని పారిపోయారన్నారు. జగన్ పిచ్చికి తగ్గట్టు తమ బందరు పిచ్చోడు పేర్ని నాని తయారయ్యాడన్నారు. సుపరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూప్‌లు పెట్టమనటాన్ని పేర్ని నానీ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కొడాలినాని, వంశీలను పేర్నినానినే దాచాడనే అనుమానాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో అక్రమ ఆస్తులు కొనటానికి వెళ్తే ప్రజలు తరిమారని.. ఇలానే పేర్నినాని పిచ్చిప్రేలాపనలు పేలితే ఏపీ ప్రజలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Aug 06 , 2024 | 12:19 PM