Share News

Payyavula Keshav , Lau Srikrishna Devaraya : ఏపీని ఆర్థికంగా ఆదుకోండి

ABN , Publish Date - Aug 13 , 2024 | 03:49 AM

ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.

Payyavula Keshav , Lau Srikrishna Devaraya :  ఏపీని ఆర్థికంగా ఆదుకోండి

  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు పయ్యావుల, లావు వినతి

న్యూఢిల్లీ, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.

సోమవారం ఢిల్లీలో నిర్మలా సీతారామన్‌తో వారిద్దరూ భేటీ అయ్యారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన నిధులు, అమరావతి నిర్మాణానికి ప్రకటించిన ప్రత్యేక సాయం రూ.15,000 కోట్లపై చర్చించినట్టు తెలిసింది. కేంద్ర పథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్లు, గత ప్రభుత్వ హయాంలో వినియోగించుకోని నిధులకు సంబంధించిన విషయాలపైనా చర్చ జరిగినట్టు తెలిసింది.

Updated Date - Aug 13 , 2024 | 03:49 AM