Share News

Lalu Prasad Yadav: 'మిస్టర్ లాలూ మీ వీల్‌ఛైర్ ఎక్కడ'.. ఎన్డీయే ఘాటు విమర్శలు

ABN , Publish Date - Jul 13 , 2024 | 01:06 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఇండియా కూటమి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన-యుబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ-ఎస్పీ నేత సుప్రియా సూలే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విచ్చేశారు.

Lalu Prasad Yadav: 'మిస్టర్ లాలూ మీ వీల్‌ఛైర్ ఎక్కడ'.. ఎన్డీయే ఘాటు విమర్శలు

ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి(Ambani Ambani-Radhika Merchant Wedding) దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఇండియా కూటమి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన-యుబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ-ఎస్పీ నేత సుప్రియా సూలే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విచ్చేశారు.

అయితే ఎప్పుడూ వీల్ ఛైర్‌పై కనిపించే లాలూ యాదవ్.. అనంత్ అంబానీ వివాహానికి వీల్ చైర్ సాయం లేకుండా వచ్చారు. దీంతో అధికార ఎన్డీయే కూటమి నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.


దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నప్పుడు, జైలుకు వెళ్లాల్సిన సందర్భంలో మాత్రమే సానుభూతి పొందేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ వీల్‌ఛైర్ ఉపయోగిస్తారని ఎన్డీయే నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణలను ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఖండిచారు. వివాహ వేడుకకు హాజరైన లాలూ.. అనంత్, రాధిక మర్చంట్‌లను ఆశీర్వదించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 13 , 2024 | 01:11 PM