Share News

Viral: ఫస్ట్ నైట్ రోజు భార్య కోసం ఎదురు చూస్తున్న భర్త.. ఇంతలో బిగ్ ట్విస్ట్..!

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:37 PM

Wife and Husband: అనగనగా ఓ అబ్బాయి.. ఆ అబ్బాయి తల్లిదండ్రులు అతనికి మంచి సంబంధాన్ని చూశారు. అమ్మాయి కూడా నచ్చడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇంకేముంది ‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!!’.. అంటూ వివాహ క్రతువు కంప్లీట్ అయ్యింది. ఇక ప్రతి జంట ఎదురు చూసే..

Viral: ఫస్ట్ నైట్ రోజు భార్య కోసం ఎదురు చూస్తున్న భర్త.. ఇంతలో బిగ్ ట్విస్ట్..!
Uttar Pradesh Couple

Wife and Husband: అనగనగా ఓ అబ్బాయి.. ఆ అబ్బాయి తల్లిదండ్రులు అతనికి మంచి సంబంధాన్ని చూశారు. అమ్మాయి కూడా నచ్చడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇంకేముంది ‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!!’.. అంటూ వివాహ క్రతువు కంప్లీట్ అయ్యింది. ఇక ప్రతి జంట ఎదురు చూసే క్షణం రానే వచ్చింది. ఫస్ట్ నైట్ కోసం ఆ వరుడు సిద్ధంగా ఉన్నాడు. భార్య రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురౌతుంటే.. ఇన్ని నాళ్ళు దాచిన హృదయం.. అంటూ సాంగ్ కూడా పాడేసుకుని ఉంటాడు. అయినా తన భార్య రాలేదు. రాత్రి 9 అయింది.. ఆమె రాలేదు. 10 అయ్యింది ఆమె రాలేదు.. 11 అయ్యింది అయినా ఆమె రాలేదు. ఏదో తేడాగా ఉందే అనుకుని గది నుంచి బయటకు వచ్చాడు నవ వరుడు.


తన భార్య కోసం వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో వాళ్లకు చెప్పగా.. వారంతా కలిసి వెతికారు అయినా ఫలితం లేకుండా పోయింది. ఫోన్ చేస్తే స్విచ్ఛాప్.. అమ్మాయి మాత్రమే మిస్ కాలేదు.. ఇంట్లో ఉండాల్సిన బంగారు నగలు, డబ్బులు సైతం మాయం అయ్యాయి. దీంతో అమ్మాయి జంప్ అని ఫిక్స్ అయ్యారు వరుడు, అతని కుటుంబ సభ్యులు. నేరుగా వధువు తల్లిదండ్రుల ఊరికి వెళ్లి వారి ఇంట్లో అడిగారు. అక్కడికి రాలేదన్నారు. చివరకు ఆమె తన ప్రియుడితో వెళ్లిపోయిందని తెలుసుకుని షాక్ అయ్యారు. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది? వరుడి కుటుంబ సభ్యులు ఏం చేశారు? పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


ఉత్తరప్రదేశ్‌ అమేథీలోని శివరత్‌గంజ్‌ పరిధిలోని తిలోయ్ గ్రామానికి చెందిన యువకుడు రితీష్(పేరు మార్చాం) పొరుగు గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం వధువును ఘనంగా ఊరిగించి తమ ఇంటికి తీసుకొచ్చారు వరుడి కుటుంబ సభ్యులు. ఇంతవరకు బాగానే ఉంది. ఒక మూడు నాలుగు రోజులు అత్తమామల ఇంటి వద్ద బాగానే ఉంది యువతి. వేద పండితుల సూచనల మేరకు శోభనానికి ముహూర్తం ఫిక్స్ చేశారు పెద్దలు. జులై 24వ తేదీన ఈ క్రతువు జరగనుండగా.. వరుడు తన గదిలో ఉన్నాడు. అయితే, అదే రోజు రాత్రి వధువు కనిపించకుండా పారిపోయింది. పారిపోయిన అమ్మాయి తనతో పాటు అత్తమామల ఇంట్లో ఉన్న బంగారు నగలు, డబ్బు అంతా ఎత్తుకెళ్లింది. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది.


దీంతో వరుడి కుటుంబ సభ్యులు వధువు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఆరా తీశారు. వారు తమకు తెలియదని.. ఇక్కడికి రాలేదని బదులిచ్చారు. ఎక్కడికి వెళ్లి ఉంటుందా? అని ఆరా తీయగా.. ఆమెకు అప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతనితోనే వెళ్లి ఉండొచ్చని సమాచారం అందింది. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులతో పాటు, అబ్బాయి, అతని కుటుంబ సభ్యులు నేరుగా ఆ ప్రేమికుడికి ఇంటికి వెళ్లారు. అక్కడ ప్రేమికుడు కూడా మిస్ అయ్యాడు. దీంతో వధువు, ఆ అబ్బాయి పారిపోయినట్లు నిర్ధారించుకున్నారు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అమ్మాయి భర్త.. ఆమెపై, ఆమె ప్రియుడిపై కేసు పెట్టాడు. తనకు ప్రియుడు ఉన్నాడని ముందే చెప్తే పెళ్లి చేసుకునే వాడిని కాదని, తనను మోసం చేసి, డబ్బు, బంగారం నగలు ఎత్తుకెళ్లారని ఆరోపించాడు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన అమ్మాయి, ఆమె ప్రియుడి కోసం గాలింపు చేపట్టారు.


Also Read:

శ్వేతపత్రమా.. సాకు పత్రమా..!

బాధపడాల్సిన అవసరం లేదు.. సీఎంలతో మోదీ..

సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పిన డీసీఎం పవన్..

For More National News and Telugu News..

Updated Date - Jul 28 , 2024 | 01:38 PM