Share News

MUDA Scam: కర్ణాటక గవర్నర్ కీలక నిర్ణయం.. సీఎం సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా..?

ABN , Publish Date - Aug 17 , 2024 | 02:13 PM

కర్ణాటక గవర్నర్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలపడంతో సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది.

 MUDA Scam: కర్ణాటక గవర్నర్ కీలక నిర్ణయం.. సీఎం సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా..?
Siddaramaiah

కర్ణాటక గవర్నర్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలపడంతో సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది. గతంలో గవర్నర్ ఆమోదం తెలిపిన అన్ని సందర్భాల్లో సీఎంలుగా ఉన్న వ్యక్తులు అరెస్ట్ కావడంతో.. ప్రస్తుతం కర్ణాటక సీఎం కూడా అరెస్ట్ అవుతారానే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి భార్య బీఎం పార్వతి ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. మైసూర్‌లో అక్రమంగా భూములు సేకరించారని సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు ఉన్నాయి. గత నెల రోజులుగా ఇదే అంశం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. తన భార్య బీఎం పార్వతికి కేటాయించిన భూమికి సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించడానికి అనుమతించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం సామాజిక కార్యకర్త, న్యాయవాది టిజె అబ్రహం గవర్నర్‌కు పిటీషన్ దాఖలు చేశారు. తాజాగా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కొద్దిరోజుల ముందు తనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గవర్నర్ తిరస్కరిస్తారని సీఎం సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. గతంలో సీఎంలుగా ఉన్న వ్యక్తులపై విచారణకు గవర్నర్ ఆమోదంతో తెలపడంతో అరెస్ట్ అయిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం.

పెట్టుబడుల సాధనకు.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌!


లాలూ ప్రసాద్ యాదవ్..

దాణా కుంభకోణంలో1997లో బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఆరోపణలు వచ్చాయి. లాలూపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేశాయి. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో సీబీఐ విచారణ చేయాలనే డిమాండ్ వినిపించింది. తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో గవర్నర్ ఏఆర్ కిద్వాయ్ లాలూ యాదవ్‌పై కేసు నమోదు చేయడానికి అనుమతి ఇచ్చారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీబీఐ ప్రారంభించింది. కొన్ని రోజుల విచారణ తర్వాత ఈ కేసులో సిబిఐ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను అరెస్టు చేసింది. అరెస్ట్ అయిన తర్వాత లాలూ తన భార్య రబ్రీదేవికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు.


బీఎస్ యడియూరప్ప

2011లో బీఎస్‌ యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే సమయంలో సంతోష్ హెగ్డే నేతృత్వంలోని లోకాయుక్త కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై అవినీతి ఆరోపణలు చేసింది. యడ్యూరప్పపై కూడా అక్రమంగా భూములు కేటాయించారనే కేసు ఉంది. ఆ సమయంలో హన్సరాజ్ భరద్వాజ్ కర్ణాటక గవర్నర్‌గా ఉన్నారు. బిఎస్ యడియూరప్పపై విచారణకు గవర్నర్ భరద్వాజ్ ఆమోదం తెలిపారు. హన్స్‌రాజ్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో లోకాయుక్త కోర్టు యడ్యూరప్పపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. 2011 అక్టోబర్‌లో యడ్యూరప్పను అరెస్టు చేయాల్సి వచ్చింది. అరెస్టు తర్వాత యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. ఈ కేసులో 23 రోజుల పాటు జైలులో ఉన్నారు. అనంతరం ఈ కేసును సీబీఐ స్వాధీనం చేసుకుని యడ్యూరప్పపై విచారణ ప్రారంభించింది.


అరవింద్ కేజ్రీవాల్

2022లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కేజ్రీవాల్ ప్రభుత్వ మద్యం పాలసీపై దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో తొలుత మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ విచారించింది. 2022 అక్టోబర్‌లో ఈడీతో పాటు సీబీఐ సిసోడియాను అరెస్టు చేసింది. సిసోడియాపై ఈ కేసు విచారణ జరుగుతుండగానే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ నిందితుడిగా చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత 2024 మార్చిలో ED కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది.


మధు కోడా

2006లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా మద్దతుతో స్వతంత్ర ఎమ్మెల్యే మధు కోడా జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి అయ్యారు. కోడా ప్రభుత్వం 2 సంవత్సరాలు సజావుగా కొనసాగింది, అయితే ఈలోగా సీఎం మధుకోడా మైనింగ్ స్కాం ఆరోపణలు ఎదుర్కొన్నారు. బొగ్గు గనుల కేటాయింపులో దాదాపు రూ.400 కోట్లు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి గవర్నర్ సిబ్తే రిజ్వీ మధుకోడాపై దర్యాప్తు కోసం సీబీఐకి లేఖ రాశారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించినప్పుడు మనీలాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలు దొరికాయి. 2009లో కోడా కేసులో సీబీఐ, ఈడీ సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. విచారణలో కోడాను సీబీఐ అరెస్ట్ చేసింది. 2012 వరకు ఆయన జైలులోనే ఉన్నారు. ఈ కేసులో అతనికి 2017లో శిక్ష పడింది. ప్రస్తుతం మధు కోడా భార్య రాజకీయాల్లో ఉన్నారు.

పోలవరానికి.. త్వరగా నిధులివ్వండి


సిద్ధరామయ్యపై కూడా ఒత్తిడి పెరుగుతుందా..?

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలపడంతో సిద్ధరామయ్యపై సమన్లు జారీచేసి దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా సిద్ధరామయ్యపై కుట్ర జరుగుతోందని కర్ణాటక డిప్యూటీ సీఎం ఇటీవల వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్యను జైలుకు పంపడం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య న్యాయ సలహా తీసుకుంటున్నారు. గవర్నర్ నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం కోర్టులో సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి.


మధుసూదన రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telugu News Click Here

Updated Date - Aug 17 , 2024 | 02:13 PM