Share News

CM Revanth Reddy: జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 08 , 2024 | 04:56 PM

జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈరోజు (ఆదివారం) రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కొంతమంది జర్నలిస్ట్‌లు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

CM Revanth Reddy: జర్నలిస్టులకు  ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈరోజు (ఆదివారం) రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కొంతమంది జర్నలిస్ట్‌లు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్ట్‌లు హద్దులు దాటి వ్యవహారించకూడదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు హాజరయ్యారు.

విలువలు దాటితే మేము దాటుతాం..

‘‘కొంతమంది జర్నలిస్టులు చీఫ్ మినిస్టర్‌ను చీప్ మినిస్టర్ అంటూ కుర్చీకు ఉన్న గౌరవం పొగొడుతున్నారు. వ్యక్తి నచ్చక పోవచ్చు వ్యవస్థలో గౌరవప్రదమైన పదవికి విలువ ఇవ్వాలి. ఎదుటి వారు విలువలు దాటితే మేము దాటుతాం. అక్రిడిటేషన్ విషయంలో ఈసారి కచ్చితంగా నిబంధనలు ఉంటాయి. జర్నలిస్ట్‌లకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇక్కడ ఉన్న వారు ఎలా ఉన్నారో ఆలోచన చేయాలి. కొన్ని సందర్భాల్లో చిట్‌చాట్‌లను సైతం ఇంకొకలాగా రాస్తున్నారు. గతంలో గాంధీ భవన్‌లో సన్నిహితంగా మాట్లాడిన మాటలను రికార్డు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసమే జర్నలిస్ట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఆరోగ్య శ్రీ కార్డుల విషయంలో ఎవరికి ఎలాంటి అపోహాలు అవసరం లేదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


11 వందల మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు..

సమాజంలో జర్నలిస్ట్‌ల సమస్యలను దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనాడే గుర్తించారని తెలిపారు. 11 వందలమంది జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం సంతోషమని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కొంతమంది బాధ్యతగా వ్యవహరించడం లేదని అన్నారు. రాష్ట్ర విభజన లాంటి అంశాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుందని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలు తమ ప్రభుత్వంలో త్వరగా పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.


రాజకీయాలపై సరైన అభిప్రాయం లేదు..

cm-revanth.jpg

జర్నలిస్టులతో ఫైళ్లు తెప్పించుకునే సంస్కృతి తమ ప్రభుత్వ విధానం కాదని చెప్పారు. అది రెగ్యులర్‎గా జరిగే ప్రక్రియ అని వివరించారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న దాని పరిష్కారానికి మాత్రమే తాము పని చేస్తామని తేల్చిచెప్పారు. వృత్తి పరమైన గౌరవాన్ని జర్నలిస్టులు పెంచుకోవాలని సూచించారు. ఇప్పటి రాజకీయాలపై సరైన అభిప్రాయం ప్రజల్లో లేదని అన్నారు. రాజకీయాలు, రాజకీయ నాయకులు అన్న ప్రజల్లో చిన్నచూపు ఉందని తెలిపారు. కేవలం కుటుంబ సభ్యుల కోసం పని చేస్తారనే అపవాదు ప్రజల్లో ఉందని విమర్శించారు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు లోపలికి వెళ్లే అవకాశం లేదని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్లే అంశం దేవుడేరుగు అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.


గతంలో సెక్రటేరియట్‎కు వెళ్లే పరిస్థితి లేదు..

సిద్ధాంత పరమైన అంశాల కోసం మాత్రమే అప్పట్లో రాజకీయ పార్టీలు, పత్రికలు పెట్టుకున్నాయని గుర్తుచేశారు. దీనికి నిదర్శనం కమ్యూనిస్టు పార్టీలని తెలిపారు. గత ప్రభుత్వంలో సెక్రటేరియట్‎కు ప్రజా ప్రతినిధులు కూడా వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. ఈరోజు జర్నలిస్ట్‌లు సైతం సచివాలయంలోకి వెళ్లవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


రాద్ధాంతం సృష్టిస్తున్నారు..

కొంతమంది జర్నలిస్ట్‌లు సెక్రటేరియట్‎లో అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. అలాంటి జర్నలిస్ట్‌లకు విలువ లేదని స్పష్టం చేశారు. ఎవరిని చూసిన తాము యూట్యూబ్ జర్నలిస్టులమని అంటున్నారని... కొందరు ఇంకేదో జర్నలిస్టులమని చెబుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..
Hydra: వాళ్లందరికీ హైడ్రా గుడ్ న్యూస్.. ఆక్రమణలు తొలగించబోమని ప్రకటన..

Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. వరద బాధితులకు ఊహించని విరాళం

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 08 , 2024 | 05:44 PM