Share News

Nutritious food: ఆరోగ్యకర ఆహారం అందడం లేదు!

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:11 AM

మన దేశ జనాభాలో సగం మందికి పైగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి వారు 55.6 శాతం మంది ఉన్నారని ఐరాసకు చెందిన ‘స్టేట్‌ ఆఫ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ అండ్‌ న్యూట్రిషియన్‌ ఇన్‌ ద వరల్డ్‌’ (సోఫీ) నివేదికలో వెల్లడించింది.

Nutritious food: ఆరోగ్యకర ఆహారం అందడం లేదు!

  • దేశంలో 55.6ు జనాభా పరిస్థితి ఇది

  • ప్రపంచంలో ప్రతి 11 మందిలో ఒకరికి క్షుద్బాధ: సోఫీ నివేదిక

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మన దేశ జనాభాలో సగం మందికి పైగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి వారు 55.6 శాతం మంది ఉన్నారని ఐరాసకు చెందిన ‘స్టేట్‌ ఆఫ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ అండ్‌ న్యూట్రిషియన్‌ ఇన్‌ ద వరల్డ్‌’ (సోఫీ) నివేదికలో వెల్లడించింది. ఇది దక్షిణాసియా దేశాల సగటు(53.1) కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. 2017లో మన దేశంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేని వారి శాతం 69.5గా ఉందని వెల్లడించింది. 2021-23 మధ్య కాలంలో 19.46 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడ్డారని తెలిపింది. మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో 58.7శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదని పేర్కొంది.


సోఫీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు..

  • ప్రపంచంలో ప్రతి 11మందిలో ఒకరు ఆకలితో బాధపడుతున్నారు. ఆఫ్రికాలో ప్రతి ఐదుగురిలో ఒకరిది ఈ పరిస్థితి.

  • తక్కువ బరువుతో జన్మించేవారు, బాల్యంలో అఽధిక బరువుతో బాధపడేవారి సంఖ్య ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్తబ్ధుగా ఉంది. అయితే 15-49 వయసు మహిళల్లో రక్తహీనత పెరిగింది. 2012లో ఇది 28.5ు ఉండగా 2019 నాటికి 29.9 శాతానికి చేరుకుంది. ఈ దశాబ్దం చివరికి అది 32.3 శాతానికి పెరుగుతుందని అంచనా.

  • ఇక ఐదేళ్లలోపు చిన్నారుల్లో వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడమనేది 2012లో 26.3 శాతం ఉండగా.. 2022 నాటికి 22.3 శాతానికి తగ్గింది. ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడమనేది కూడా 2012లో 7.5 శాతం ఉండగా, 2022నాటికి 6.8 శాతానికి తగ్గింది.

  • 2022లో ప్రపంచ జనాభాలో 280 మంది కోట్ల మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇది అధికాదాయం ఉన్న దేశాల్లో 6.3శాతం, మధ్యస్థ ఆదాయదేశాల్లో 21.5శాతం, తక్కువ ఆదాయమున్న దేశాల్లో 52.6 శాతం, అల్పాదాయ దేశాల్లో 71.5శాతంగా నమోదైంది.

  • 2030 నాటికి ప్రపంచవ్యాప్తగా 58.2 కోట్ల మంది దీర్ఘకాలిక పోషకాహార లోపంతో బాధపడతారు. ఇందులో సగానికిపైగా ఆఫ్రికా దేశాల్లోనే ఉంటారు.

  • ఆహార కొరత 2019లో 9.1 శాతం ఉండగా.. 2020 నాటికి 10.6 శాతానికి పెరిగింది.

  • 2012లో ప్రపంచ జనాభాలో 12.1 శాతం ఊబకాయులు ఉండగా.. అది 2022 నాటికి 15.8 శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది.

Updated Date - Jul 27 , 2024 | 04:11 AM