Share News

CM Revanth Reddy: రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లోనే కనిపిస్తున్నారు..

ABN , Publish Date - Jun 18 , 2024 | 04:27 AM

రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో మెసేజ్‌లు పెడుతూ కనిపిస్తున్నారు తప్ప.. బాధితులను పరామర్శించడం లేదని సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ బాబు అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

CM Revanth Reddy: రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లోనే కనిపిస్తున్నారు..

  • శాంతి భద్రతలను సమీక్షించరా?: పాల్వాయి

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో మెసేజ్‌లు పెడుతూ కనిపిస్తున్నారు తప్ప.. బాధితులను పరామర్శించడం లేదని సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ బాబు అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం ప్రకటన చేసినా.. ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోట హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని.. వాటిపై కనీసం సమీక్ష చేసే సమయం రేవంత్‌కు లేదా..? అని ప్రశ్నించారు.


కాగా, కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి.. హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌లకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. సెల్యూట్‌ తెలంగాణ పేరుతో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు.

Updated Date - Jun 18 , 2024 | 04:27 AM