Share News

Chandrababu : ఢిల్లీలో న్యాయవాదులతో చంద్రబాబు భేటీ.. ఏం చర్చించారంటే..?

ABN , First Publish Date - 2023-11-28T18:01:20+05:30 IST

ఢిల్లీలో న్యాయవాదులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా సుప్రీంకోర్టులో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, పైబర్ నెట్ కేసులపై న్యాయవాదులతో చంద్రబాబు చర్చించారు.

 Chandrababu : ఢిల్లీలో న్యాయవాదులతో చంద్రబాబు భేటీ.. ఏం చర్చించారంటే..?

ఢిల్లీ: ఢిల్లీలో న్యాయవాదులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా సుప్రీంకోర్టులో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, పైబర్ నెట్ కేసులపై న్యాయవాదులతో చంద్రబాబు చర్చించారు. చంద్రబాబును కలిసిన వారిలో సుప్రీంకోర్టు న్యాయవాదులు గుంటూరు ప్రభాకర్, ప్రమోద్, ప్రేరణ తదితరులు ఉన్నారు.

అనంతరం ఢిల్లీలో ఉన్న టీడీపీ నేతలతో కూడా చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని, రామ్మోహన్ నాయుడులతో ప్రధాన అంశాలపై చంద్రబాబు కూలంకషంగా చర్చించారు. చంద్రబాబును వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణమరాజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సమావేశం తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి ప్రత్యేక విమానంలో చంద్రబాబు బయలుదేరారు. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-11-28T18:21:56+05:30 IST