Share News

Aparajita: వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారు

ABN , First Publish Date - 2023-11-03T19:04:35+05:30 IST

ప్రొద్దుటూరులో వైసీపీ నాయకులు ( YCP Leaders ) తమను అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని టీడీపీ నేత నందం సుబ్బయ్య భార్య అపరాజిత ( Aparajita ) ఆవేదన వ్యక్తం చేశారు.

Aparajita: వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారు

కడప: ప్రొద్దుటూరులో వైసీపీ నాయకులు ( YCP Leaders ) తమను అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని టీడీపీ నేత నందం సుబ్బయ్య భార్య అపరాజిత ( Aparajita ) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో హత్యకు గురైన టీడీపీ నేత నందం సుబ్బయ్య భార్య అపరాజిత శుక్రవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘‘మూడేళ్లక్రితం నా భర్త నందం సుబ్బయ్యను ఎమ్మెల్యే రాచమల్లు బావమరిది బంగారురెడ్డి హత్య చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రోత్సాహించడంతోనే బంగారురెడ్డి తన భర్తను చంపారు. ప్రొద్దుటూరులో వైసీపీ నేత బంగారురెడ్డి చేసే దందాలు, భూకబ్జాలు బయట పెడతారనే నందం సుబ్బయ్యను చంపారు. నందం సుబ్బయ్యను చంపినట్టే.. నా కుటుంబ సభ్యులను చంపుతామని వైసీపీ నాయకుడు ప్రొద్దుటూరులో అందరిని బెదిరిస్తున్నారు. నా భర్తను చంపిన నిందితులు జైల్లో ఉండాలని ప్రతిరోజూ ప్రార్థిస్తున్నాను. నందం సుబ్బయ్య హత్య కేసులో దోషిగా ఉన్న బెనర్జీ వైసీపీ నేతలతో ఎందుకు తిరుగుతున్నాడో తెలపాలి. ఇటీవల వైసీపీ కార్యకర్త బెనర్జీపై దాడి జరిగితే ఎలాంటి సంబం ధం లేని టీడీపీ నేత ప్రవీణ్‌రెడ్డిపై కేసునమోదు చేయడం దారుణం’’ అని అపరాజిత తెలిపారు.

Updated Date - 2023-11-03T19:04:37+05:30 IST