Share News

Bride: 2 రోజుల్లో పెళ్లనగా ఈ వధువుకు ఇలా జరిగిందేంటి..? ఫోన్ చేసి పిలిచాడని కాబోయే భర్త ఇంటికి వెళ్తే..!

ABN , First Publish Date - 2023-11-21T20:37:32+05:30 IST

చాలా ప్రేమ వ్యవహారాలు.. కుటుంబ సభ్యుల కారణంగా పెళ్లి వరకూ వెళ్లకుండా మధ్యలోనే ముగిసిపోతుంటాయి. ఆస్తుల విషయంలో కొందరు.. కుల, మతాలను సాకుగా చూపుతూ మరికొందరు తమ పిల్లల ప్రేమ వివాహాలను వ్యతిరేకిస్తుంటారు. ఈ క్రమంలో...

Bride: 2 రోజుల్లో పెళ్లనగా ఈ వధువుకు ఇలా జరిగిందేంటి..? ఫోన్ చేసి పిలిచాడని కాబోయే భర్త ఇంటికి వెళ్తే..!
ప్రతీకాత్మక చిత్రం

చాలా ప్రేమ వ్యవహారాలు.. కుటుంబ సభ్యుల కారణంగా పెళ్లి వరకూ వెళ్లకుండా మధ్యలోనే ముగిసిపోతుంటాయి. ఆస్తుల విషయంలో కొందరు.. కుల, మతాలను సాకుగా చూపుతూ మరికొందరు తమ పిల్లల ప్రేమ వివాహాలను వ్యతిరేకిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు పెద్దలను ఎదిరించి వివాహాలు చేసుకుంటే.. మరికొందరు ఎవరినీ నొప్పించలేక చివరకు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుంటారు. తాజాగా, కర్ణాటకలో విషాద ఘటన చోటు చేసుకుంది. సరిగ్గా రెండు రోజుల్లో పెళ్లనగా కాబోయే భర్త ఫోన్ చేయడంతో వధువు వెళ్లింది. చివరకు ఊహించని ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని (Karnataka) విజయనగర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన అశోక్ కుమార్, ఐశ్వర్య అనే యువతి పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చదువుకునే రోజుల్లో వీరి మధ్య ప్రేమ మొదలైంది. ప్రస్తుతం ఇద్దరూ ఓ పెద్ద ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఐశ్వర్య కుటుంబం దళిత వర్గానికి చెందినది కావడంతో అశోక్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా చివరకు బలవంతం మీద అంగీకరించాల్సి వచ్చింది. అయితే వివాహానికి వధువు కుటంబ సభ్యులతో సహా బంధువులు ఎవరూ హాజరుకావొద్దని కండీషన్ పెట్టారు. ఈ మాట వినగానే వధువు కూడా షాక్ అయింది.

Wife: కూల్‌డ్రింక్‌లో విషం పెట్టి భర్తను చంపేందుకు ఓ భార్య స్కెచ్.. అసలు నిజం తెలిసిన ఆ భర్త ఏం చేశాడంటే..!

కూతురు సంతోషం కోసం ఆమె తల్లిదండ్రులు ఆ నిబంధనకు అంగీకరించారు. నవంబర్ 23న అశోక్, ఐశ్వర్య వివాహం (love marriage) జరగాల్సి ఉంది. వరుడి కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉండగా.. వధువు కుటంబంలో మాత్రం ఆ సంతోషం లేదు. తల్లిదండ్రులు లేకుండా వివాహం చేసుకోవాల్సి వస్తుందే.. అన్న బాధతో వధువు కుమిలిపోతూ ఉంది. వివాహానికి రెండు రోజుల ముందు వరుడి నుంచి వధువుకు ఫోన్ వచ్చింది. ‘‘నువ్వు ఒక్కదానివే ఇక్కడికి రావాలి’’.. అని చెప్పడంతో ఇష్టం లేకున్నా కుటుంబ సభ్యుల బలవంతం మీద.. ఐశ్వర్య ఒక్కటే సోమవారం అత్తగారి ఊరికి వెళ్లింది.

Viral News: పళ్లతోనే గిన్నీస్ బుక్ రికార్డును సాధించిన మహిళ.. ఆమెకు ఎన్ని దంతాలు ఉన్నాయో తెలిస్తే..!

అశోక్ ఇంట్లో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. అదే రోజు ఐశ్వర్య ఉరి వేసుకుని (Bride suicide) ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియగానే.. ఐశ్వర్య తల్లిదండ్రులు గండెలవిసేలా విలపించారు. పెళ్లికూతురు కావాల్సిన తమ కూతురు.. ఇలా శవమై ఇంటికి రావడాన్ని.. ఆమె తల్లిదండ్రులతో పాటూ గ్రామస్తులూ జీర్ణించుకోలేకపోయారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, వరుడి కుటంబమే హత్య చేసిందని ఐశ్వర్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Woman Constable: ఈ మహిళా కానిస్టేబుల్‌కు ఏమైంది..? కొద్ది రోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కానీ..!

Updated Date - 2023-11-21T20:38:14+05:30 IST