ప్రియురాలి చేతులు, కాళ్లపై నూనె పోసి ప్రియుడు చేసిన నిర్వాకం.. కాసేపటికి బయటికి వచ్చిన ఆమె.. చివరికి తండ్రికి ఫోన్ చేయడంతో..

ABN , First Publish Date - 2023-04-23T20:56:02+05:30 IST

పదో తరగతి చదివిన అతను ఖాళీగా ఉంటూ జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలో అతడికి ఇంజనీరింగ్ చదివే యువతితో పరిచయం ఏర్పడింది. అతడి ప్రవర్తన నచ్చడంతో ఆమె కూడా స్నేహం చేసింది. సాన్నిహిత్యం పెరడగడంతో ఓ రోజు..

ప్రియురాలి చేతులు, కాళ్లపై నూనె పోసి ప్రియుడు చేసిన నిర్వాకం.. కాసేపటికి బయటికి వచ్చిన ఆమె.. చివరికి తండ్రికి ఫోన్ చేయడంతో..
ప్రతీకాత్మక చిత్రం

పదో తరగతి చదివిన అతను ఖాళీగా ఉంటూ జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలో అతడికి ఇంజనీరింగ్ చదివే యువతితో పరిచయం ఏర్పడింది. అతడి ప్రవర్తన నచ్చడంతో ఆమె కూడా స్నేహం చేసింది. సాన్నిహిత్యం పెరడగడంతో ఓ రోజు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆమె చేతులు, కాళ్లపై వేడి నూనె పోసి దారుణానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకున్న యువతి పరుగు పరుగున బయటికి వచ్చి, తండ్రికి ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఏలూరు (Andhra Pradesh Eluru district) సమీపంలోని ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి పెద్ద కుమార్తె దీపిక (పేరు మార్చాం) అనే యువతి (young woman) .. కాకినాడలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. రెండో కుమార్తె ఎంబీబీఎస్‌ (MBBS) కోసం లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌లో ఉంది. శనివారపేట సమీపంలోని ప్రాంతానికి చెందిన అనుదీప్‌ అనే వ్యక్తి పదో తరగతి వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు. గత నాలుగేళ్లుగా దీపికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈనెల 9వ తేదీన కాకినాడలో ఉన్న దీపికను పెళ్లి చేసుకుంటానని ఏలూరు తీసుకొచ్చి తన ఇంట్లో బంధించాడు. వివాహేతర సంబంధం కొనసాగిం చాలని ప్రయత్నించగా ఆమె నిరాకరించింది.

Viral Video: నడి రోడ్డుపై కారును కడుగుతున్న యువతి.. చివరకు అసలు విషయం తెలుసుకుని అవాక్కయిన వాహనదారులు..

అయినా మరోసారి 10వ తేదీ రాత్రి అలాగే బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. దీంతో యువతి కాళ్లు, చేతులపై వేడి నూనె పోసి అత్యాచారానికి (Indecent behavior) పాల్పడ్డాడు. అప్పటి నుంచి ఆమెను ఇంట్లో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. 22వ తేదీ రాత్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేయడానికి ప్రయత్నించగా అతికష్టం మీద అతని చెర నుంచి తప్పించుకుని బయటకు వచ్చి తన తండ్రికి ఫోన్‌ చేసింది. ఆమె ఫోన్‌ మాట్లాడడం గమనించి అనుదీప్‌ పారిపోయాడు. వెంటనే తండ్రి అక్కడకు చేరుకుని ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Viral News: ఈ ఇల్లు మాకొద్దంటున్నా.. దంపతులకు అద్దెకు ఇచ్చిన యజమాని.. 25 రోజుల తర్వాత వెళ్లి చూడగా.. వారు చేసిన నిర్వాకం..

Updated Date - 2023-04-23T20:56:02+05:30 IST