Groom: పెళ్లి మండపంలో షాకింగ్ సీన్.. రానని అంటున్నా.. బలవంతంగా వరుడిని ఎత్తుకెళ్లిన బంధువులు.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-05-06T19:37:31+05:30 IST

కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్ద గొడవలుగా మారిపోతుంటాయి. ఇంకొన్నిసార్లు ఎలాంటి బలమైన కారణం లేకున్నా ఒకరినొకరు కొట్టుకునే వరకూ వెళ్తుంటారు. చివరకు కారణం ఏంటా అని ఆరా తీస్తే.. చాలా సిల్లీగా ఉంటుంది. ఇలాంటి ఘటనలు...

Groom: పెళ్లి మండపంలో షాకింగ్ సీన్.. రానని అంటున్నా.. బలవంతంగా వరుడిని ఎత్తుకెళ్లిన బంధువులు.. అసలేం జరిగిందంటే..!

కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్ద గొడవలుగా మారిపోతుంటాయి. ఇంకొన్నిసార్లు ఎలాంటి బలమైన కారణం లేకున్నా ఒకరినొకరు కొట్టుకునే వరకూ వెళ్తుంటారు. చివరకు కారణం ఏంటా అని ఆరా తీస్తే.. చాలా సిల్లీగా ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఎక్కువగా శుభకార్యాల సమయంలో జరుగుతుంటాయి. ప్రస్తుతం ఓ పెళ్లి మంటపంలో జరిగిన ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కళ్యాణ మంటపంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. మధ్యలో రాను అంటున్న బంధువులంతా వచ్చి వరుడిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఆగ్రాలోని షాగంజ్‌లో ఉన్న ఓ కళ్యాణ మంటపంలో (wedding hall) ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహం సందర్భంగా జగదీష్‌పురాకు చెందిన వరుడు (groom) ఊరేగింపుగా కళ్యాణ మంటపానికి వచ్చాడు. అప్పటికే అక్కడ వధువు (bride) సిద్ధంగా ఉంది. వధూవరుల ఊరేగింపునకు ఏర్పాట్లు ఘనంగా చేశారు. అతిథులందరి సమక్షంలో ఊరేగింపు మొదలైంది. మరోవైపు డీజే పాటలకు (DJ songs) యువతీయువకులు పోటాపోటీగా డాన్సులు వేస్తున్నారు. సందడి సందడిగా ఉన్న సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఏమైందో ఏమో కారణం తెలీదు గానీ వధూవరుల తరపు బంధువుల మధ్య మొదట వాగ్వాదం మొదలైంది. అది కాస్తా.. కొద్ది సేపటికి పెద్ద గొడవగా (quarrels) మారింది. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.

Viral News: ఈ ఫొటోలోని మహిళ వయసెంతో అంచనా వేయగలరా..? చూడటానికి కాలేజీ అమ్మాయిలా కనిపిస్తోంది కానీ..!

మంటపంలో ఏం జరుగుతుందో అర్థం కాక భోజనాలు చేస్తున్న వారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. గొడవ పెద్దది అవడంతో బంధువులు చొరవ తీసుకుని వరుడిని అక్కడి నుంచి బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. రాను రాను అంటున్నా అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. మరోవైపు ఈ గొడవలో సుమారు ఆరుగురు గాయపడ్డట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గొడవపడ్డ వారందరికీ నచ్చజెప్పారు. రెండు కుటుంబాల పెద్దలను కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ గొడవలో వరుడు గాయపడకూదనే ఉద్దేశంతో పక్కకు లాక్కెళ్లినట్లు బంధువులు తెలిపారు. అయితే ఈ ఘటనపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదులు చేసుకోలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో (Viral photos and videos) వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Indian Railway: రైలు ఎక్కి సీట్లో కూర్చున్న మరుక్షణమే ఉలిక్కిపడ్డ కుర్రాడు.. దిగ్గున లేచి సీట్లో ఏముందో చూసి షాక్.. చివరకు..!

Updated Date - 2023-05-06T19:37:31+05:30 IST