అంత్యక్రియలు ఆపేయండి.. సినీ ఫక్కీలో ఆఖరి నిమిషంలో పోలీసుల ఎంట్రీ.. చితిపై నుంచి ఆ మహిళ మృతదేహాన్ని తీయించి మరీ..

ABN , First Publish Date - 2023-02-25T20:25:45+05:30 IST

ఇద్దరు పిల్లలతో ఆనందంగా ఉన్న మహిళ.. ఇటీవల ఓ రోజు ఉన్నట్టుండి ఉరికి వేలాడుతూ కనిపించింది. బంధవులంతా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. సినీ ఫక్కీలో..

అంత్యక్రియలు ఆపేయండి.. సినీ ఫక్కీలో ఆఖరి నిమిషంలో పోలీసుల ఎంట్రీ.. చితిపై నుంచి ఆ మహిళ మృతదేహాన్ని తీయించి మరీ..

ఇద్దరు పిల్లలతో ఆనందంగా ఉన్న మహిళ.. ఇటీవల ఓ రోజు ఉన్నట్టుండి ఉరికి వేలాడుతూ కనిపించింది. బంధవులంతా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. సినీ ఫక్కీలో ఆఖరి నిముషంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మృతదేహాన్ని చితిపై నుంచి కిందకు దించి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానింగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పోలీసుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మధుర పరిధి ఠాకుద్వార్ ప్రాంతానికి చెందిన అమిత్ అనే యువకుడికి.. దీక్ష (26) అనే యువతితో 2014లో (marriage) వివాహమైంది. వీరికి ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహమైన మొదట్లో అందరిలా సంతోషంగానే ఉండేవారు. అయితే రాను రాను అమిత్.. పరాయి మహిళలపై ఆశపడ్డాడు. అప్పటి నుంచి భార్యను పట్టించుకోవడం తగ్గించాడు. రోజు రోజుకూ ఎక్కువ సమయం మహిళలతోనే (extramarital affair) గడిపేవాడు. తర్వాత వారిలో ఒకరిని వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నాడు. అయితే ఇందుకు భార్య (wife) అడ్డుగా ఉందని భావించి, ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని రోజూ ఆలోచించేవాడు. ఈ క్రమంలో అదనపు పుట్టింటి నుంచి డబ్బులు తేవాలంటూ భార్యను వేధించడం మొదలెట్టాడు. ఈ వేధింపులు (Harassment) రోజు రోజుకూ ఎక్కువయ్యాయి.

భర్త శరీరంలో కూడా గర్భాశయం.. పెళ్లయి 5 ఏళ్లయినా పిల్లలు పుట్టడం లేదని భార్యతో సహా ఆస్పత్రికెళ్తే డాక్టర్లు బయటపెట్టిన నిజాలివి..!

ఈ క్రమంలో ఏమైందో ఏమో గానీ గురువారం ఉదయం దీక్ష.. తన ఇంట్లో ఉరికి వేలాడుతూ (woman Suspicious death) కనిపించింది. మృతదేహాన్ని అమిత్ కుటుంబ సభ్యులు నేరుగా అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్లారు. అయితే ఈ విషయం తెలుసుకున్న దీక్ష తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంత్యక్రియలు జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్న పోలీసులు.. వారిని వారించి, మృతదేహాన్ని కిందకు దించారు. అనంతరం పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపయే ముందు తమతో ఫోన్‌లో బాధగా మాట్లాడిందని మృతురాలి సోదరి తెలిపింది. మృతురాలి మెడపై గాయాలు ఉండడంతో పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

పెళ్లి తర్వాత ఇలాగే జరగాలంటూ వధువు వింత కోరిక.. వరుడి తండ్రి కూడా ఒప్పుకోవడంతో.. చివరకు అంతా కలిసి..

Updated Date - 2023-02-25T20:25:54+05:30 IST