Share News

Thummala: ఖమ్మంలో అరాచకంపై మేధావి వర్గం ఆలోచన చేయాలి

ABN , First Publish Date - 2023-11-17T21:05:09+05:30 IST

అరాచకం అవినీతి దుష్ట పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు.

Thummala:  ఖమ్మంలో అరాచకంపై మేధావి వర్గం ఆలోచన చేయాలి

ఖమ్మం: అరాచకం అవినీతి దుష్ట పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు. శుక్రవారం నాడు తుమ్మల మిత్ర మండలి ఆధ్వర్యంలో మామిళ్లగూడెంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ..‘‘దేశం సమగ్రత సమైక్యత కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో జోడో యాత్ర ఐక్యం చేసింది. అన్ని వర్గాలు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉంటాయి. సమాజ నిర్మాణంలో అభివృద్ధిలో బ్రాహ్మణుల పాత్ర ఎంతో ఉంది. అరాచకం భూ కబ్జాలు లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బ్రాహ్మణులు నిలవాలి. ఖమ్మంలో అరాచకంపై మేధావి వర్గం ఆలోచన చేయాలి’’ అని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2023-11-17T21:05:10+05:30 IST