Vinod Kumar: జమిలి ఎన్నికలపై మోడీ సర్కార్‌వి అన్ని డ్రామాలే..

ABN , First Publish Date - 2023-09-04T21:53:07+05:30 IST

మిలి ఎన్నికల(Jamili election)పై మోడీ సర్కార్‌(MODI GOVt)వి అన్ని డ్రామాలేనని ప్రణాళిక సంఘం ఊపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్ కుమార్(Boinpally Vinod Kumar) తెలిపారు.

Vinod Kumar: జమిలి ఎన్నికలపై మోడీ సర్కార్‌వి అన్ని డ్రామాలే..

హైదరాబాద్: జమిలి ఎన్నికల(Jamili election)పై మోడీ సర్కార్‌(MODI GOVt)వి అన్ని డ్రామాలేనని ప్రణాళిక సంఘం ఊపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్ కుమార్(Boinpally Vinod Kumar) తెలిపారు. సోమవారం నాడు ఏబీఎన్‌తో మాట్లాడుతూ..భారత్ అన్ని రాష్ట్రాల కలయిక అని చెప్పారు. జమిలి ఎన్నికల సాధ్య సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌(Ram Nath Kovind)తో కమిటీ ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా ఉంది. భారత రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తులు ఎలాంటి రాజకీయ పరమైన అంశాల్లో ఉండకూడదు. కమిటీలో దక్షిణ భారతదేశం నుంచి ఎవరికీ చోటు కల్పించక పోవడం దేనికి సంకేతం.ఇప్పటికే నిర్ణయించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల(Sessions of Parliament) పేరిట హడావుడి చేస్తుంది.2018లోనే లా కమిషన్‌కు జమిలిపై బీఆర్ఎస్ ప్రభుత్వం అభిప్రాయాన్ని చెప్పింది.ఇప్పటికిప్పుడు మరోసారి నిర్ణయం చెప్పాలంటే కుదరదు.సమయం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయం చెప్తారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోలేని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటరని అనుకోం.తెలంగాణలో ఎన్నికలు వాయిదా పడతాయని అనుకోను.. ఎందుకంటే జమిలి ఎన్నికల అంశం ఇప్పట్లో తేలేది కాదని వినోద్ కుమార్ తెలిపారు.

Updated Date - 2023-09-04T21:53:07+05:30 IST