Share News

Arani Srinivasulu: వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి

ABN , Publish Date - Mar 09 , 2024 | 03:35 PM

Andhrapradesh: రాష్ట్రంలో వైసీపీని, చిత్తూరులో వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బడా ఎర్రచందనం స్మగ్లర్ విజయానంద రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో గుట్కా ,పేకాట, లాటరీ, ఇసుక ఇలా అన్ని రకాల అక్రమ కార్యకలాపాలను పెంచి పోషించిన వ్యక్తి విజయానంద రెడ్డి అని అన్నారు.

Arani Srinivasulu: వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి

చిత్తూరు, మార్చి 9: రాష్ట్రంలో వైసీపీని, చిత్తూరులో వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డిని (YCP candidate Vijayananda Reddy) చిత్తుచిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు (MLA Arani srinivasulu) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బడా ఎర్రచందనం స్మగ్లర్ విజయానంద రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో గుట్కా ,పేకాట, లాటరీ, ఇసుక ఇలా అన్ని రకాల అక్రమ కార్యకలాపాలను పెంచి పోషించిన వ్యక్తి విజయానంద రెడ్డి అని అన్నారు. విజయానందరెడ్డికి ఓట్లేసి గెలిపిస్తే చిత్తూరులో రౌడీయిజం పెట్రేగిపోతుందని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తనను ఎన్నో అవమానాలకు గురి చేశారన్నారు. అంతో ఇంతో అభివృద్ధి జరిగిందంటే టీడీపీ ప్రభుత్వం చలవే అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే జనసేన పార్టీలోకి వెళ్ళానని ఆరని శ్రీనివాసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్!


Atchennaidu: బాబాయి బాత్రూం మర్డర్ కేసు మిస్టరీ వీడుతుందనే బెదిరింపులు..


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 09 , 2024 | 03:35 PM