Share News

Jagan: రేపు పులివెందులలో జగన్ పర్యటన

ABN , Publish Date - Jun 21 , 2024 | 10:04 PM

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రేపు (శనివారం) పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి ఐదురోజులపాటు పులివెందులలో జగన్ మకాం వేయనున్నారు.

 Jagan: రేపు పులివెందులలో జగన్ పర్యటన
YS Jagan Mohan Reddy

అమరావతి: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రేపు (శనివారం) పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి ఐదురోజులపాటు పులివెందులలో జగన్ మకాం వేయనున్నారు. సీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో జగన్ భేటీకానున్నారు. జగన్‌ కోసం వైసీపీ కేడర్ భారీ ఏర్పాట్లు చేసింది.


నియోజకవర్గ ముఖ్య నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ పటిష్టతపై చర్చించనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌కు నివాళి అర్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా పులివెందులలో అధినేత పర్యటించనున్నారు. కాగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ నేతలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఫలితాలపై జగన్ చర్చించిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 21 , 2024 | 10:04 PM