Share News

కులగణనకు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: స్టాలిన్‌

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:12 AM

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేపట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తెలిపారు.

కులగణనకు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: స్టాలిన్‌

చెన్నై, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేపట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యుడు జీకే మణి మాట్లాడుతూ, రాష్ట్రంలో కులాల వారీగా జనాభా లెక్కలను చేపట్టాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఇప్పటికే బీహార్‌ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా కులగణన చేపట్టగా, దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే కేంద్ర ప్రభుత్వమే తక్షణం కులగణన చేపట్టాలని కోరారు.

Updated Date - Jun 25 , 2024 | 03:16 AM