Share News

AADI SRINIVAS: వరదపై బీఆర్ఎస్ బురద రాజకీయాలు... ఆది శ్రీనివాస్ విసుర్లు

ABN , Publish Date - Sep 05 , 2024 | 06:54 PM

వరదపైన బీఆర్ఎస్ పార్టీ బురద రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. ఈరోజు(గురువారం) హైదరాబాద్‎లోని సీఎల్పీ మీడియా హాల్లో ఆది శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు.

AADI SRINIVAS: వరదపై బీఆర్ఎస్ బురద రాజకీయాలు... ఆది శ్రీనివాస్ విసుర్లు
AADI SRINIVAS

హైదరాబాద్: వరదపైన బీఆర్ఎస్ పార్టీ బురద రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. ఈరోజు(గురువారం) హైదరాబాద్‎లోని సీఎల్పీ మీడియా హాల్లో ఆది శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్ఎస్ నాయకులకు పనిగా మారిందని మండిపడ్డారు. వరద కష్టాల్లో కూడా కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయాలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అనుకోని విపత్తు  వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా విమర్శలు చేస్తారా? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.


ALSO Read: Uttam kuamr: మరమ్మతులు, పునరుద్ధరణకు టెండర్లను పిలవండి.. మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

అమెరికాలో  కేటీఆర్  ఎంజాయ్..

సహాయక చర్యలపై ప్రభుత్వానికి సలహా, సూచనలు ఇవ్వ కుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తూ‎ ట్విట్టర్‎లో విషం చిమ్ముతున్నారని ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ అడ్రస్ ఇప్పటి వరకు తెలియదు?  అని ఆక్షేపించారు. కేసీఆర్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఫాంహౌస్‎లో ఉన్నారా లేక నంది నగర్‎లో ఉన్నారా?  అని ఆది శ్రీనివాస్ నిలదీశారు.

వరద బాధితుల కుటుంబాలకు కనీసం సంతాపం కూడా తెలపనంత బిజీగా కేసీఆర్ ఉన్నారా? అని ప్రశ్నించారు. బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి కూడా నోరు రావడం లేదా అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‎లో పడుకుని మాజీ మంత్రి హరీష్‎రావును జనం పైన దాడికి పంపించారని ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు.


ALSO Read: Mobile Recovery: మీ ఫోన్ పోయిందా?.. రికవరీ అయిన మొబైల్స్‌లో ఒకటి మీదేనా?

ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టారు..

ఖమ్మంలో బాధితులను పరామ ర్శించకుండా హరీష్‎రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. హరీష్‎రావు వైఖరి కారణంగా అక్కడ గందరగోళం చోటు చేసుకుందని చెప్పారు. హరీష్‎రావు నోరు తెరిస్తే రాజకీయం తప్ప మరొకటి లేదని ఆక్షేపించారు. గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు విదేశీ కుట్ర అని కేసీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. క్లౌడ్‌ బరస్ట్ ద్వారా భారీ వర్షాలు కురిపిస్తున్నారంటూ నోటీకొచ్చినట్లు అబద్దాలు చెప్పారని విమర్శించారు. ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యం అంటూ కొడుకు, అల్లుడుతో కేసీఆర్ విష ప్రచారం చేయిస్తున్నారని ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.

గత పదేళ్లలో చాలాసార్లు వరదలు వచ్చినప్పుడు పరిహారం ఇవ్వకుండా పచ్చి మోసం చేశారని విమర్శలు చేశారు. గతంలో హైదరాబాద్‎లో వరదలు వచ్చినప్పుడు ఇంటికి రూ. 10 వేలు పరిహారం ఇస్తామని బాధితులను కేసీఆర్ దగా చేశారని ఆరోపించారు. కేసీఆర్‎ను ఫామ్ హౌస్ నుంచి బయటకు తీసుకువచ్చే ధైర్యం బీఆర్ఎస్ నేతలకు ఉందా అని సవాల్ విసిరారు. ప్రజలపై అంత ప్రేమ ఉంటే మాజీ మంత్రి కేటీఆర్ 18 గంటల్లో అమెరికా నుంచి రావొచ్చు కదా అని ఆది శ్రీనివాస్ సవాల్ విసిరారు.

తమ ప్రభుత్వం సహాయక చర్యలపై చిత్తశుద్దితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారని గుర్తుచేశారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందజేస్తున్నామని అన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నామని గుర్తుచేశారు. ప్రతి ఇంటికి రూ.10 వేల తక్షణ సాయం అందిస్తున్నామని ప్రకటించారు. చనిపోయిన గేదెలు, గొర్రెలు, మేకలకు కూడా సాయం అందజేస్తామని ఆది శ్రీనివాస్ తెలిపారు.


అందుకే సీఎం చంద్రబాబుపై ప్రశంసలు..

తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన ఈర్షతోనే ఏపీ సీఎం చంద్రబాబు బాగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశంసిస్తున్నారని అన్నారు. కేంద్రం నుంచి తక్షణ సాయం రూ. 20, 000 కోట్లు ఇవ్వాలని అడిగామని.. కానీ కేంద్రమంత్రులు సోది కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పోయిందని ఆది శ్రీనివాస్ విమర్శించారు.

కేంద్రం సాయం చేయాలి..

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం విషయంలో పొరపాటు జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే వేముల పట్ల అమర్యాదగా వ్యవహారించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Harish Rao: విద్యా వ్యవస్థ ఇంకా బలోపేతం కావాలి

Vijayawada Floods: బిగ్ రిలీఫ్.. కోలుకుంటున్న బెజవాడ

Ranganath: హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలే గతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 05 , 2024 | 07:17 PM