Share News

Jagadish Reddy: విద్యుత్ కమిషన్ నుంచి జగదీష్ రెడ్డికి లెటర్.. ఏమన్నారంటే..?

ABN , Publish Date - Jun 23 , 2024 | 04:31 PM

విద్యుత్ కమిషన్ నుంచి తనకు లెటర్ వచ్చిందని.. కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై తన అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారని మాజీమంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు

Jagadish Reddy: విద్యుత్ కమిషన్  నుంచి జగదీష్ రెడ్డికి లెటర్.. ఏమన్నారంటే..?

హైదరాబాద్: విద్యుత్ కమిషన్ నుంచి తనకు లెటర్ వచ్చిందని.. కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై తన అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారని మాజీమంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు సాయాన్ని ఆపడానికి వీలులేదన్నారు. రైతు భరోసా పేరుతో రూ. 15,000 ఇస్తామని మాట తప్పారని మండిపడ్డారు.కేబినెట్ సబ్ కమిటీ రైతులను మోసం చేయడానికి వేసిన కమిటీ అని చెప్పారు.


రైతు రుణమాఫీతో సంబంధం లేకుండా రైతు బంధు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతానని అన్నారు.ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్,విద్యుత్ అధికారుల నుంచి కమిషన్ సమాచారం తీసుకోవాలని తెలిపారు. పర్యావరణ అనుమతులు ఇచ్చిన వారిని విచారణకు పిలుస్తారా...? అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - Jun 23 , 2024 | 04:31 PM