Groom: అసలు నిజం తెలిసి వరుడిని వదిలేసి పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన వధువు.. పోలీసుల ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-05-06T21:00:39+05:30 IST

పురోహితులు వేద మంత్రాలు చదువుతుండగా.. బంధువులంతా అక్షింతలు పట్టుకుని ఆసక్తిగా తిలకిస్తుండగా.. వధువు మెడలో వరుడు తాళి కట్టేందుకు సిద్ధమవుతాడు. తీరా తాళి కట్టే సమయంలో ఆపండి..! అంటూ పోలీసులు ఎంటర్ అవుతారు. ఇలాంటి సీన్లు..

Groom: అసలు నిజం తెలిసి వరుడిని వదిలేసి పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన వధువు.. పోలీసుల ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ప్రతీకాత్మక చిత్రం

పురోహితులు వేద మంత్రాలు చదువుతుండగా.. బంధువులంతా అక్షింతలు పట్టుకుని ఆసక్తిగా తిలకిస్తుండగా.. వధువు మెడలో వరుడు తాళి కట్టేందుకు సిద్ధమవుతాడు. తీరా తాళి కట్టే సమయంలో ఆపండి..! అంటూ పోలీసులు ఎంటర్ అవుతారు. ఇలాంటి సీన్లు సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు నిజ జీవితంలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. పెళ్లి మంటపంలో ఊరేగింపు జరుగుతుందనగా.. అసలు నిజం తెలిసి వధువు అక్కడి నుంచి వెళ్లిపోయింది. పోలీసుల ఎంట్రీతో చోటు చేసుకున్న ఊహించని ట్విస్ట్ ఏంటంటే..

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) జాంజ్‌గిర్ చంపా ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక శివనారాయణ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతానికి చెందిన నిరంజన్ ఆదిత్య.. స్థానికంగా ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌లో (Coaching Centre) టీచర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో ఇతడికి నాలుగేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతి (young woman) పరిచయమైంది. కోచింగ్ సమయంలో ఆమె సందేహాలను నివృత్తి చేసే క్రమంలో బాగా దగ్గరయ్యాడు. దీంతో కొన్నాళ్లకే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. క్రమంగా అది ప్రేమకు (love) దారి తీసింది. పెళ్లి చేసుకుంటనాని మాట ఇవ్వడంతో యువతి అతడిని పూర్తిగా నమ్మింది.

Groom: పెళ్లి మండపంలో షాకింగ్ సీన్.. రానని అంటున్నా.. బలవంతంగా వరుడిని ఎత్తుకెళ్లిన బంధువులు.. అసలేం జరిగిందంటే..!

తర్వాత ఓ రోజు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కాబోయే భర్తే కదా అనుకుని ఆమె కూడా ఎవరికీ చెప్పలేదు. ఇలా నాలుగేళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడుతూ వచ్చాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెబుతూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఇటీవల ప్రియురాలికి చెప్పకుండా వేరే యువతితో పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నాడు. ప్రియుడికి వేరే అమ్మాయితో వివాహం (marriage) జరుగుతోందని తెలుసుకున్న యువతి.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసును పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో యువతి తీవ్ర ఆగ్రహానికి గురైంది.

Marriage: పెళ్లయిన 3 గంటల తర్వాత బాత్రూంకు వెళ్లిన వరుడు.. తిరిగొచ్చి కుర్చీలో కూర్చుని అక్కడికక్కడే మృతి.. అసలేం జరిగిందంటే..!

పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చుని ఆందోళనకు సిద్ధమైంది. విషయం పెద్దది అవడంతో పోలీసులు స్పందించారు. బుధవారం జాంజ్‌గిర్ చంపాలో నిరంజన్ వివాహం జరుగుతోందని తెలుసుకుని నేరుగా పెళ్లి మంటపం వద్దకే వెళ్లారు. అప్పటికి ఊరేగింపునకు సిద్ధంగా ఉన్న వరుడిని అదుపులోకి (Grooms arrest) తీసుకున్నారు. పోలీసులు చెప్పింది విని వధువు కోపంతో మంటపం నుంచి బయటికి వెళ్లిపోయింది. ఇరువైపు కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసిన పోలీసులు.. చివరకు వరుడిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

Indian Railway: రైలు ఎక్కి సీట్లో కూర్చున్న మరుక్షణమే ఉలిక్కిపడ్డ కుర్రాడు.. దిగ్గున లేచి సీట్లో ఏముందో చూసి షాక్.. చివరకు..!

Updated Date - 2023-05-06T21:00:39+05:30 IST