Share News

V.Hanumanthrao: తెలంగాణకు వచ్చి నీతులు చెబుతున్నారు.. మోదీపై వీహెచ్ ఫైర్

ABN , Publish Date - May 11 , 2024 | 04:46 PM

Telangana: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చి నీతులు చెబుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమికి మోదీ భయపడుతున్నారన్నారు. రజాకార్ల పాట ఎన్ని రోజులు పాడతారని అన్నారు. రజాకార్లు ఉన్నప్పుడు బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. అదానీ, అంబానీలకు మాత్రమే మోదీ న్యాయం చేశారని విమర్శించారు.

V.Hanumanthrao: తెలంగాణకు వచ్చి నీతులు చెబుతున్నారు.. మోదీపై వీహెచ్ ఫైర్
Congress Leader V Hanumanth rao

హైదరాబాద్, మే 11: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తెలంగాణకు (Telangana) వచ్చి నీతులు చెబుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (Congress Leader V.Hanumanth rao) మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమికి మోదీ భయపడుతున్నారన్నారు. రజాకార్ల పాట ఎన్ని రోజులు పాడతారని అన్నారు. రజాకార్లు ఉన్నప్పుడు బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. అదానీ, అంబానీలకు మాత్రమే మోదీ న్యాయం చేశారని విమర్శించారు. మోదీ ఏమైనా అమితాబ్ అనుకుంటున్నాడా? షారూఖ్ అనుకుంటున్నాడా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

AP Election 2024: జగన్‌కు షాకిచ్చిన తల్లి విజయమ్మ.. షర్మిలకు మద్దతు ప్రకటన


మణిపూర్‌లో మహిళల బట్టలు విప్పి నడిపిస్తే మోదీ మాట్లాడారా అని ప్రశ్నించారు. కులగణన చేస్తామని 2008లో బీజేపీ నాయకులు అన్నారని... ఇప్పటిదాకా చేయలేదన్నారు. గుజరాత్‌లో ముస్లింలను ఊచకోత కోశారన్నారు. ‘‘నా పేరే హనుమంతుడు. నేను రాముడి భక్తుడిని. నేను సచ్చేదాకా కాంగ్రెస్‌లోనే ఉంటా. కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తా’’ అని వీహెచ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Election 2024: మీ ఎమ్మెల్యే ఇంటికి అల్లు అర్జున్ వస్తే ఇలా చేస్తారా? ఇది తగునా?: చంద్రబాబు

AP Election 2024:సర్వేలను నేను నమ్మను... మాకు వచ్చే సీట్లు ఇవే..: మంత్రి బొత్స సత్యనారాయణ

Read Latest AP News And Telugu News

Updated Date - May 11 , 2024 | 04:52 PM