Woman: మంచి మంచి సంబంధాలు.. అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలవే.. ఈ యువతి అన్నిటికీ నో చెప్పి..!

ABN , First Publish Date - 2023-07-18T19:16:48+05:30 IST

ఆ తల్లిదండ్రులు కూతురిని ఉన్నత చదువులు చదివించారు. అలాగే ఆమె జీవితం మరింత బాగుండాలనే ఉద్దేశంతో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కూడా అనుకున్నారు. ఇటీవల మంచి మంచి సంబంధాలు వచ్చాయి. అంతా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలే. అయినా యువతి మాత్రం..

Woman: మంచి మంచి సంబంధాలు.. అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలవే.. ఈ యువతి అన్నిటికీ నో చెప్పి..!

ఆ తల్లిదండ్రులు కూతురిని ఉన్నత చదువులు చదివించారు. అలాగే ఆమె జీవితం మరింత బాగుండాలనే ఉద్దేశంతో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కూడా అనుకున్నారు. ఇటీవల మంచి మంచి సంబంధాలు వచ్చాయి. అంతా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలే. అయినా యువతి మాత్రం అన్నింటికీ నో చెబుతూ వచ్చింది. ఎన్ని సంబంధాలు తెచ్చినా వద్దని చెబుతుండడంతో తండ్రికి విసుగొచ్చింది. ఓ రోజు గట్టిగా నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

రాజస్థాన్ (Rajasthan) చురులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక తారానగర్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల పార్వతి అనే యువతి (young woman) .. పొలిటికల్ సైన్స్‌లో (Political Science) ఎంఏ పూర్తి చేసి, ప్రస్తుతం అగ్రికల్చర్ సూపర్‌వైజర్ పోస్టుకు సంబంధించిన పరీక్షలకు సిద్ధమవుతోంది. ఇదిలావుండగా, మరోవైపు ఆమె తల్లిదండ్రులు పెళ్లి చూడడం మొదలెట్టారు. యువతి బాగా చదువుకోవడంతో మంచి మంచి సంబంధాలు చాలా వచ్చాయి. వాటిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగస్తులే ఉన్నారు. అయినా యువతికి మాత్రం ఎవరూ నచ్చలేదు. ఎనిమిదేళ్లుగా ఆమె స్థానిక ప్రాంతానికి చెందిన యోగేంద్ర అనే వ్యక్తిని (Love with young man) ప్రేమిస్తూ ఉంది. యోగేంద్ర ఇదే ప్రాంతంలో డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు.

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై రాత్రి వేళ ప్రేమికుల వింత నిర్వాకం.. యువతి ముందు అతనిలా ఎందుకు చేశాడంటూ..

77.jpg

యోగేంద్ర 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. అయినా పార్వతి మాత్రం అతన్నే పెళ్లి (marriage) చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం ఇన్నాళ్లు ఇంట్లో చెప్పకుండా నెట్టుకొచ్చింది. ఎన్ని మంచి సంబంధాలు తెస్తున్నా నచ్చలేదు అని చెబుతుండడంతో తండ్రికి విసుగొచ్చింది. ఓ రోజు గట్టిగా నిలదీయడంతో కూతురు ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పార్వతి తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తాము చెప్పిన వ్యక్తినే వివాహం చేసుకోవాలని షరతు పెట్టాడు. ఈ క్రమంలో జూలై 7న పరీక్ష రాసేందుకు వెళ్తున్నానని చెప్పి.. యోగేంద్రతో కలిసి వెళ్లిపోయింది. ఇద్దరూ కలిసి కొన్నాళ్లు యోగేంద్ర సోదరి ఇంట్లో ఉన్నారు. తర్వాత తారానగర్ వచ్చి గుడిలో వివాహం చేసుకున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించి.. తల్లిదండ్రుల నుంచి ప్రాణభయం ఉందంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోద చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: వామ్మో! ఇదేం విచిత్రం.. నడుస్తూ వెళ్తున్న మహిళ.. ఒక్కసారిగా ఎలా స్తంభించిపోయిందంటే..

Updated Date - 2023-07-18T19:20:48+05:30 IST