Shocking: డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు కదా అని ఆటో ఎక్కిందో యువతి.. కొద్దిదూరం వెళ్లగానే ఇద్దరు కుర్రాళ్ల ఎంట్రీ.. చివరకు..!

ABN , First Publish Date - 2023-09-05T18:23:00+05:30 IST

అప్పటిదాకా మంచిగా కనిపించే చాలా మంది.. ఆడవారిని చూడగానే మానవ మృగాళ్లలా మారిపోతుంటారు. చివరకు విచక్షణ మరచి వికృతచేష్టలు చేస్తుంటారు. మరికొందరైతే తమ మాట వినని వారి పట్ల దారుణాలకూ పాల్పడుతుంటారు. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా...

Shocking: డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు కదా అని ఆటో ఎక్కిందో యువతి.. కొద్దిదూరం వెళ్లగానే ఇద్దరు కుర్రాళ్ల ఎంట్రీ.. చివరకు..!
ప్రతీకాత్మక చిత్రం

అప్పటిదాకా మంచిగా కనిపించే చాలా మంది.. ఆడవారిని చూడగానే మానవ మృగాళ్లలా మారిపోతుంటారు. చివరకు విచక్షణ మరచి వికృతచేష్టలు చేస్తుంటారు. మరికొందరైతే తమ మాట వినని వారి పట్ల దారుణాలకూ పాల్పడుతుంటారు. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా ఇలాంటి కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా, హర్యానాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు కదా అని ఓ యువతి ఆటో ఎక్కింది. అయితే కాస్త దూరం వెళ్లగానే ఆటోలో మరో ఇద్దరు కుర్రాళ్లు ఎక్కారు. చివరకు ఏం జరిగిందంటే..

హర్యానా (Haryana) ఫరీదాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బల్లభ్‌గఢ్ ప్రాంతానికి చెందిన 24ఏళ్ల యువతి.. ఫరీదాబాద్‌లోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పని చేస్తోంది. ఆదివారం ఇంట్లో నుంచి తనకు కాబోయే భర్తకు ఫోన్ చేసింది. ఫోన్ మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. ఈ కోపంలో ఆమె ఇంటి నుంచి బయలుదేరి స్థానిక సెక్టార్-12 ప్రాంతంలోని పార్కు వద్దకు వెళ్లింది. అక్కడి వెళ్లిన కొద్ది సేపటి తర్వాత తన అక్క, బావకు ఫోన్ చేసి తనకు కాబోయే భర్తతో జరిగిన గొడవ గురించి చెప్పింది. దీంతో ఆమెను ఇంటికి వెళ్లమంటూ అక్క, బావ సూచించారు. చివరకు యువతి (young woman) ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుని.. పార్కు వద్ద ఆటో కోసం వేచి చూస్తూ ఉంది.

Indian Railway: రైలు ప్రయాణమే ఈ భార్యాభర్తలిద్దరి ప్రాణాలనూ తీసేసింది.. స్టేషన్ వచ్చింది కదా అని దిగడానికి వెళ్తే..!

అదే సమయంలో ఓ ఆటో అక్కడికి వచ్చి ఆగింది. యువతిని ఆటో (Auto) ఎక్కించుకున్న డ్రైవర్.. మార్గమధ్యలో మరో ఇద్దరు యువకులను ఎక్కించుకున్నాడు. అయితే ఆటోను బల్లభ్‌గఢ్‌కు తీసుకెళ్లకుండా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. దీంతో అనుమానం వచ్చి యువతి ప్రశ్నించడంతో పక్కనే ఉన్న యువకులు ఆమె నోరు మూశారు. తర్వాత ఇద్దరు యువకులు ఆమెపై (Indecent behavior) అఘాయిత్యానికి పాల్పడ్డారు. తర్వాత మూడో వ్యక్తి దగ్గరికి రాగానే.. అతడి కళ్లలో ఇసుక చల్లి అక్కడి నుంచి ఆమె తప్పించుకుంది. బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంఘటన స్థలంలోని సీసీ కెమరాలను పరిశీలించారు. చివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Husband: రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లిన భార్య.. తిరిగొచ్చేసరికి ఈ భర్త ఇలా చేశాడేంటి..? ఇంటి తలుపులు తీసి చూస్తే..!

Updated Date - 2023-09-05T18:23:00+05:30 IST