Share News

Wife: రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు లోపల నుంచి వినిపించిన శబ్ధాలు.. భార్యపై జరుగుతున్న దారుణాన్ని చాటుగా చూసి కూడా..

ABN , Publish Date - Dec 23 , 2023 | 08:33 PM

సాటి వారు కష్టాల్లో ఉన్నా కూడా కనీసం కన్నెత్తి చూడని రోజులివి. మనకెందుకొచ్చిన సమస్య అనుకుంటూ చాలా మంది మిన్నకుండిపోతుంటారు. అయితే కొందరు మాత్రం తమ కుటుంబ సభ్యుల పట్ల కూడా ఇదేవిధంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా...

Wife: రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు లోపల నుంచి వినిపించిన శబ్ధాలు.. భార్యపై జరుగుతున్న దారుణాన్ని చాటుగా చూసి కూడా..
ప్రతీకాత్మక చిత్రం

సాటి వారు కష్టాల్లో ఉన్నా కూడా కనీసం కన్నెత్తి చూడని రోజులివి. మనకెందుకొచ్చిన సమస్య అనుకుంటూ చాలా మంది మిన్నకుండిపోతుంటారు. అయితే కొందరు మాత్రం తమ కుటుంబ సభ్యుల పట్ల కూడా ఇదేవిధంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ వ్యక్తి ఆరుబయటకు వెళ్లి ఇంటికి వచ్చాడు. రాగానే ఇంటి లోపలి నుంచి శబ్ధాలు వినిపించాయి. లోపల భార్యపై దారుణం జరుగుతున్నా ఏమాత్రం స్పందించకుండా చాటుగా చూస్తూ ఉన్నాడు. చివరకు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముజఫర్‍నగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక భోపా పోలీస్ స్టేషన్ పరిధి జౌలి గ్రామానికి చెందిన మహ్మద్ ఇద్రీష్ అనే వ్యక్తి .. భార్య జుబైదా (65) తో కలిసి నివాసం ఉంటున్నాడు. మీరికి ఖాసీం అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇదిలావుండగా.. మహ్మద్ ఇద్రీష్‌కు, వారి బంధువులకు మధ్య భూమి విషయంలో చాలా రోజులుగా గొడవలు జరుగుతన్నాయి. ఈ గొడవలు ఇటీవల ఇంకా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఊరికి వెలుపల ఉన్న పొలాల్లోకి మరుగుదొడ్డికి వెళ్లిన మహ్మద్.. కాసేపటికి తిరిగి వచ్చాడు. అయితే ఇంటికి రాగానే లోపలి నుంచి అరుపులు, కేకలు వినిపించాయి. ఏంటా అని రహస్యంగా కిటీకీలో నుంచి చూడగా.. కొందరు దుండగులు తన భార్యపై కత్తులు, కర్రలతో దాడి చేస్తున్నారు.

Viral Video: దోచుకోవాలని వచ్చి.. క్షణాల్లో పారిపోయాడు.. కౌంటర్‌లో యువతి వద్ద అతడు చేసిన మిస్టేక్ ఏంటంటే..

POLICE.jpg

భార్యపై దారుణం జరుగుతున్నా అతను భయంతో ఏమాత్రం స్పందించలేదు. కనీసం చుట్టుపక్కల వారిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయకుండా అలాగే చూస్తుండిపోయాడు. జుబైదాను దారుణంగా హత్య చేసిన నిందుతులు.. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. వారు వెళ్లిన తర్వాత పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భూ తగదా కారణంగా తమపై తమ బంధువులు కక్ష కట్టారని, నజీమ్‌, యూసుఫ్‌, యూనస్‌, నూర్‌ మహ్మద్‌, జాన్‌ మహ్మద్‌ తన తల్లిన హత్య చేశారని మృతురాలి కుమారుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: పెళ్లిలో వధూవరుల మధ్య ఆసక్తికర పోటీ.. చివరకు విపరీతమైన కోపంతో వధువు చేసిన పని...

Updated Date - Dec 23 , 2023 | 08:34 PM