Share News

YS Sharmila: ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకి షర్మిల.. ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ

ABN , Publish Date - Jun 17 , 2024 | 10:09 PM

ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను ఈరోజు(సోమవారం) ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఢిల్లీలో కలిశారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకొనే నిర్ణయాలపై ఏఐసీసీ అగ్రనేతలపై షర్మిల చర్చించారు.

YS Sharmila: ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకి షర్మిల..  ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ
YS Sharmila

ఢిల్లీ: ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను ఈరోజు(సోమవారం) ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఢిల్లీలో కలిశారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకొనే నిర్ణయాలపై ఏఐసీసీ అగ్రనేతలపై షర్మిల చర్చించారు. అయితే 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే.


అయితే ఈ ఎన్నికల్లో షర్మిల మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. హస్తం పార్టీ ఓడిపోవడానికి షర్మిల వైఖరే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత సుంకర పద్మశ్రీ, మరికొంత మంది నేతలు కూడా బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. షర్మిల టికెట్లు అమ్ముకున్నారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేతలను వైఎస్ షర్మిల కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - Jun 17 , 2024 | 10:09 PM